అక్షరటుడే నిజామాబాద్ సిటీ: RTC Bus | ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మాక్లూర్ (Makloor) మండల శివారులో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ (Makloor SI Rajasekhar) తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ (Nizamabad) నుంచి వరంగల్(Warangal) వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మాక్లూర్ నుంచి నిజామాబాద్ వస్తున్న కారును దాస్నగర్ (Das nagar) వద్ద ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ మహమ్మదీ (52) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న మహమ్మదీ కొడుకు, కోడలు, కూతురికి గాయాలయ్యాయి. వీరిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. మృతురాలి భర్త షేక్ బషీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.