Homeబిజినెస్​Stock Market | రెండు రోజుల్లో రూ.8.35 లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాలను మూటగట్టుకున్న...

Stock Market | రెండు రోజుల్లో రూ.8.35 లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Stock Market : భౌగోళిక, రాజకీయ, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మన మార్కెట్లు భారీగా కుంగాయి. గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.8.35 కోట్ల సంపద ఆవిరి అయిపోయింది.

ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ భీకర దాడులు చేయడం, మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు తోడు ముడి చమురు ధరలు (crude oil prices) ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు భారీ నష్టాలు మూటగట్టుకున్నారు. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో మొత్తంగా రూ. 8.35 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయాయి.

ఎన్‌ఎస్ఈ బెంచ్‌మార్క్ నిఫ్టీ(NSE benchmark Nifty) 169.6 పాయింట్లు (0.68% ) పడిపోయి 24,718 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్(BSE Sensex) కూడా శుక్రవారం వరుసగా రెండో రోజు కూడా నష్టాలకే పరిమితమైంది. 573.38 పాయింట్లు కోల్పోయి 81,118.60 వద్ద ముగిసింది.

సెషన్ ప్రారంభంలో ఇండెక్స్ 1,337.39 పాయింట్లు పడిపోయి 80,354.59 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. రెండు రోజుల్లో సెన్సెక్స్ 1,396.54 పాయింట్లు లేదా 1.69% పడిపోయింది. అమ్మకాల ప్రభావం పెట్టుబడిదారుల సంపదలో స్పష్టంగా కనిపించింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,35,799.85 కోట్లు తగ్గి రూ. 4.47 లక్షల కోట్లకు పరిమితమైంది.

Stock Market : చమురు మంటలు..

భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ భీకర దాడులు చేయడంతో బ్రెంట్‌ క్రూడ్ధరలు పరుగందుకున్నాయి. బ్రెంట్ క్రూడ్(Brent crude), ప్రపంచ చమురు బెంచ్‌మార్క్(global oil benchmark) 7.61% పెరిగి బ్యారెల్‌కు $74.64కి చేరుకుంది.

“ఇజ్రాయెల్(Israel) ఇరాన్‌(Iran)పై సైనిక దాడులు ప్రారంభించిన తర్వాత బలహీనపడిన సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదలకు ప్రతిస్పందనగా భారత ఈక్విటీలు బాగా పడిపోయాయి” అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(Motilal Oswal Financial Services Ltd) రీసెర్చ్‌ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు. ముడి చమురు ధరలు బాగా పెరగడం వల్ల రూపాయి విలువ తగ్గిందని, OMCలు, పెయింట్స్, టైర్లు, ఇతర లూబ్రికెంట్ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని ఖేమ్కా అన్నారు.

“శుక్రవారం భారత ఈక్విటీ మార్కెట్లు భారీ అమ్మకాలను చవిచూశాయి. నిఫ్టీ-50(Nifty-50), సెన్సెక్స్ రెండూ ఇంట్రా-డే కనిష్ట స్థాయిల నుంచి బయటపడ్డాయి, కానీ ఇప్పటికీ గణనీయమైన నష్టాలతో ముగిశాయి” అని లెమన్ మార్కెట్ డెస్క్ విశ్లేషకుడు సతీష్ చంద్ర అలూరి తెలిపారు.

సెన్సెక్స్ 30లో అదానీ పోర్ట్స్, ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ భారీగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మారుతి సుజుకి, సన్ ఫార్మా లాభాల్లో ముగిశాయి.

Must Read
Related News