Hyderabad | డబ్బులు డబుల్​ అవుతాయని చెప్పి.. రూ.500 కోట్ల మోసం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​లోని మాదాపూర్​ (Madhapur)లో భారీ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్​ అవుతాయని నమ్మించిన ఓ సంస్థ ప్రజల నుంచి రూ.500 కోట్లు వసూలు చేసింది. మాదాపూర్​లోని ఏవీ ఇన్ఫ్రాకాన్ (AV Infracon)  ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ బైబ్యాక్‌ పేరుతో రూ.500 కోట్ల మోసానికి పాల్పడింది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే డబుల్​ ఇస్తామని సంస్థ యజమాని విజయ్​ గొగుల ప్రజలను నమ్మించారు. డబ్బులు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​లోని మాదాపూర్​ (Madhapur)లో భారీ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్​ అవుతాయని నమ్మించిన ఓ సంస్థ ప్రజల నుంచి రూ.500 కోట్లు వసూలు చేసింది. మాదాపూర్​లోని ఏవీ ఇన్ఫ్రాకాన్ (AV Infracon)  ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ బైబ్యాక్‌ పేరుతో రూ.500 కోట్ల మోసానికి పాల్పడింది.

తమ కంపెనీలో పెట్టుబడి పెడితే డబుల్​ ఇస్తామని సంస్థ యజమాని విజయ్​ గొగుల ప్రజలను నమ్మించారు. డబ్బులు ఇవ్వకపోతే తగిన భూమి రిజిస్ట్రేషన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో చాలా మంది ఆ సంస్థలో పెట్టుబడి పెట్టారు. సుమారు 500 మంది నుంచి రూ.500 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంతకు డబ్బులు రిటర్న్​ ఇవ్వకపోవడంతో బాధితులు ఆయనను ప్రశ్నించారు. దీంతో మరో ప్రాజెక్ట్​ ఉందంటూ నమ్మించాడు.

బాధితులు గట్టిగా ప్రశ్నిస్తే బ్లాంక్ చెక్కులు ఇస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు సైబరాబాద్ (Cyberabad)​ కమిషనరేట్​లో, మాదాపూర్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు మాదాపూర్​ పోలీసులు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...