ePaper
More
    Homeక్రైంJeedimetla | స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడుల పేరిట రూ.150 కోట్ల మోసం

    Jeedimetla | స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడుల పేరిట రూ.150 కోట్ల మోసం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jeedimetla | ఆశ మనిషిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. అత్యాశ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది.

    ప్రస్తుత రోజుల్లో ప్రజలు తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలని కలలు కంటున్నారు. వీరినే లక్ష్యంగా చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్​ నేరగాళ్ల (Cyber Criminals) నుంచి మొదలు పెడితే మల్టీ లెవల్​ మార్కెటింగ్ (MLM)​ కంపెనీలు, ఇతర నకిలీ కంపెనీలు పెట్టి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు.

    నిత్యం ఇలాంటి మోసాలు జరుగుతున్నా.. ఇంకా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా స్టాక్​మార్కెట్​ (Stock Market)లో పెట్టుబడుల (Investment) పేరిట ఓ సంస్థ మోసానికి పాల్పడింది. పలువురు అమాయకులను ఏకంగా రూ.150 కోట్ల మోసగించింది. ఈ ఘటన రాష్ట్రంలో చర్చకు దారితీసింది.

    జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​ (Jeedimetla Police Station) పరిధిలోని చింతల్‌ గణేశ్‌నగర్‌లో ది పెంగ్విన్‌ సెక్యూరిటీస్‌ (The Penguin Securities) పేరుతో ఓ సంస్థ వెలిసింది. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. వీరి మాయ మాటలు నమ్మి దాదాపు 1,500 మంది రూ.150 కోట్ల మేర ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్ట్​ చేసిన వారికి నమ్మకం కలిగించేలా వారికి బాండ్లు కూడా అందజేశారు.

    తీరా ఈ మధ్య కార్యకలాపాలు ఆపేశారు. ఎవరితో టచ్ లో లేకుండా సంస్థ యాజమాన్యం ఉదయించింది. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​కు చేరుకొని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    Latest articles

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు..

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...

    Engineering colleges | ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering colleges | రాష్ట్రంలో ఇంజినీరింగ్​ కాలేజీల (engineering colleges) ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక...

    More like this

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు..

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...