Nizamabad Police | రైస్​మిల్​ వ్యాపారం పేరుతో మత్తు మందు ఇచ్చి దోపిడీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad Police | రైస్​మిల్​ వ్యాపారం చేస్తే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభం వస్తుందని నమ్మించి ఓ వ్యక్తిని నిలువు దోపిడీ చేసిన ముఠాను నాలుగో టౌన్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్​హెచ్​వో సతీష్​ కుమార్​ (SHO Satish Kumar) వెల్లడించారు. నగరానికి చెందిన శ్రీనివాస్​ అనే వ్యక్తికి ఇటీవల ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. రైస్​మిల్​ వ్యాపారం (Rice Mill Business) చేస్తే తక్కువ సమయంలోనే అధిక […]

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad Police | రైస్​మిల్​ వ్యాపారం చేస్తే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభం వస్తుందని నమ్మించి ఓ వ్యక్తిని నిలువు దోపిడీ చేసిన ముఠాను నాలుగో టౌన్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్​హెచ్​వో సతీష్​ కుమార్​ (SHO Satish Kumar) వెల్లడించారు.

నగరానికి చెందిన శ్రీనివాస్​ అనే వ్యక్తికి ఇటీవల ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. రైస్​మిల్​ వ్యాపారం (Rice Mill Business) చేస్తే తక్కువ సమయంలోనే అధిక లాభాలు గడించవచ్చని ఆయనను వారు నమ్మించారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు కలిసి నగరంలోని ఓ ఇంటర్నేషనల్​ హోటల్​లో దావత్​ పేరుతో బీరులో మత్తుమందు కలిపి శ్రీనివాస్​తో తాగించారు. అనంతరం అతడు అపస్మాకర స్థితికి చేరుకోగానే రెండు బంగారు ఉంగరాలు, గోల్డ్​ చైన్​, కొంత నగదు దోచుకుని పారిపోయారు. అనంతరం తేరుకున్న శ్రీనివాస్​ తాను మోసపోయానని గుర్తించి నాలుగో టౌన్​ పోలీసులకు (4th Town Police) ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి నిందితులు బాత ప్రసాదం, నర్సింగరావు, రుద్రా యాదవ్​ను అదుపులోకి తీసుని విచారించారు. కాగా నేరాన్ని వారు ఒప్పుకున్నారని.. చోరీ చేసిన బంగారాన్ని హైదరాబాద్కు (Hyderabad)​ చెందిన శ్రీనివాస్​ అనే వ్యక్తి వద్ద తాకట్టు పెట్టినట్లు తెలిపారని పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ముగ్గురిని రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై ఉదయ్​కుమార్​, ఎస్సై సందీప్​కుమార్​ పాల్గొన్నారు. అలాగే కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు శేఖర్​, రమేష్​, నగేష్​, ఏఎస్సై రవీందర్​, సిబ్బందిని సీఐ అభినందించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...