CP Sai Chaitanya | జల్సాలకు అలవాటు పడి చోరీలు.. ఇద్దరి అరెస్ట్

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 31 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya ) తన కార్యాలయంలో ఆదివారం వివరాలు వెల్లడించారు. నిజామాబాద్​కు చెందిన షేక్ సల్మాన్, మరాటి ఆకాష్ రావు, షేక్ సాదక్, వినోద్, రమేష్ చవాన్, ముక్తే సాయినాథ్ ముఠాగా ఏర్పడి చోరీలు […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 31 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya ) తన కార్యాలయంలో ఆదివారం వివరాలు వెల్లడించారు.

నిజామాబాద్​కు చెందిన షేక్ సల్మాన్, మరాటి ఆకాష్ రావు, షేక్ సాదక్, వినోద్, రమేష్ చవాన్, ముక్తే సాయినాథ్ ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. జల్సాలకు డబ్బులు సరిపోవడం లేదని దొంగతనాలు (Thefts)  చేయడం ప్రారంభించారు. షేక్ సాదక్ ముఠాకు లీడర్​గా ఉంటూ నడిపిస్తున్నాడు. తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేసి వీరు చోరీలకు పాల్పడుతున్నారు.

CP Sai Chaitanya | ఇలా దొరికారు..

నగరంలోని నాగారం బ్రాహ్మణ కాలనీకి చెందిన వేలేటి పవన్ శర్మ ఇంట్లో చోరీ జరిగింది. 33 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.30 వేల నగదు దొంగతనం జరిగిందని ఆయన ఈ నెల 23న ఐదో టౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు (police) ఆదివారం ఉదయం నాగారం డబుల్ బెడ్ రూమ్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ముఠా సభ్యులు షేక్ సల్మాన్, మరాఠీ ఆకాశరావులుగా గుర్తించి అరెస్ట్​ చేశారు. వారి నుంచి 31 తులాల బంగారం ఆభరణాలు, ఆటో, మొబైల్ ఫోన్ స్వాధీం చేసుకున్నారు.

ఏసీపీ రాజా వెంకటరెడ్డి (ACP Raja Venkat Reddy) ఆధ్వర్యంలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ ఈ కేసును ఛేదించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...