Railway overbridges | ఆర్​వోబీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

అక్షరటుడే, ఇందూరు: Railway overbridges | జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో శనివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) ఆయా అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మాధవ్​నగర్ ఆర్​వోబీకి రూ.3.15 కోట్లు, అర్సపల్లికి రూ.7.46 కోట్ల నిధులను […]

అక్షరటుడే, ఇందూరు: Railway overbridges | జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో శనివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) ఆయా అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మాధవ్​నగర్ ఆర్​వోబీకి రూ.3.15 కోట్లు, అర్సపల్లికి రూ.7.46 కోట్ల నిధులను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందన్నారు. కాబట్టి సకాలంలో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అలాగే పనులను సకాలంలో పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. అడవి మామిడిపల్లి వద్ద బీటి రోడ్డు పనులను పూర్తి చేసి, డిసెంబర్ 15వ తేదీ లోపు వంతెనను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు.

Railway overbridges | నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ఇటీవల కురిసిన భారీ వర్షాల (heavy rains) వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. రంగు మారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూడాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని, మరో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...