BJP MLAs | ఆర్వోబీల పనులను త్వరగా పూర్తిచేయాలి.. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

అక్షరటుడే, ఇందూరు : BJP MLA | జిల్లాలోని ఆర్వోబీల పనులను త్వరగా పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachari) డిమాండ్​ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ నాయకులను శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లా సమస్యలను ముఖ్యమంత్రికి తెలిపేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లాలో మాధవనగర్, అడవి మామిడిపల్లి, అర్సపల్లి […]

అక్షరటుడే, ఇందూరు : BJP MLA | జిల్లాలోని ఆర్వోబీల పనులను త్వరగా పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachari) డిమాండ్​ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ నాయకులను శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లా సమస్యలను ముఖ్యమంత్రికి తెలిపేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లాలో మాధవనగర్, అడవి మామిడిపల్లి, అర్సపల్లి ఆర్వోబీ(ROB)లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. సీఎంను కలిసి సమస్యలు చెప్పాలనుకుంటే అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.

BJP MLAs | పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన..

జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి నిఖిల్ సాయి చౌరస్తాలో నిరసన తెలపడానికి వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో పోలీసులు, నాయకులకు తోపులాట చోటుచేసుకుంది.

BJP MLAs | కలెక్టరేట్​లో బీజేపీ ఎమ్మెల్యేల భైఠాయింపు..

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కొత్త కలెక్టరేట్​లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే జిల్లా సమస్యల పరిష్కరించాలంటూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(Urban MLA Dhanpal), ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి(MLA Rakesh Reddy)లు కలెక్టరేట్​లో భైఠాయించి నల్ల బడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను సీఎంకు వివరిస్తామంటూ నినాదాలు చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...