Homeజిల్లాలునిజామాబాద్​BJP MLAs | ఆర్వోబీల పనులను త్వరగా పూర్తిచేయాలి.. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

BJP MLAs | ఆర్వోబీల పనులను త్వరగా పూర్తిచేయాలి.. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

నిజామాబాద్​ జిల్లాలో పెండింగ్​లో ఉన్న ఆర్వోబీ పనులను త్వరగా పూర్తి చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. సీఎం రాక నేపథ్యంలో కలెక్టరేట్​ వద్ద భైఠాయించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : BJP MLA | జిల్లాలోని ఆర్వోబీల పనులను త్వరగా పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachari) డిమాండ్​ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ నాయకులను శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లా సమస్యలను ముఖ్యమంత్రికి తెలిపేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లాలో మాధవనగర్, అడవి మామిడిపల్లి, అర్సపల్లి ఆర్వోబీ(ROB)లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. సీఎంను కలిసి సమస్యలు చెప్పాలనుకుంటే అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.

BJP MLAs | పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన..

జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి నిఖిల్ సాయి చౌరస్తాలో నిరసన తెలపడానికి వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో పోలీసులు, నాయకులకు తోపులాట చోటుచేసుకుంది.

BJP MLAs | కలెక్టరేట్​లో బీజేపీ ఎమ్మెల్యేల భైఠాయింపు..

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కొత్త కలెక్టరేట్​లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే జిల్లా సమస్యల పరిష్కరించాలంటూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(Urban MLA Dhanpal), ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి(MLA Rakesh Reddy)లు కలెక్టరేట్​లో భైఠాయించి నల్ల బడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను సీఎంకు వివరిస్తామంటూ నినాదాలు చేశారు.