Collector Nizamabad | రోడ్ల మరమ్మతు పనులను పూర్తి చేయాలి: కలెక్టర్​

అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | నగరంలో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద, బైపాస్ రోడ్డు మార్గంలో, డిచ్​పల్లి రైల్వేస్టేషన్ (Dichpalli Railway Station) ఎదురుగా ప్రధాన రహదారిపై పనులను శుక్రవారం పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని ఆర్​అండ్​బీ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో చేపట్టేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. […]

అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | నగరంలో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద, బైపాస్ రోడ్డు మార్గంలో, డిచ్​పల్లి రైల్వేస్టేషన్ (Dichpalli Railway Station) ఎదురుగా ప్రధాన రహదారిపై పనులను శుక్రవారం పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని ఆర్​అండ్​బీ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో చేపట్టేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు.

Collector Nizamabad | అధికారులపై అసంతృప్తి

నిజామాబాద్ (Nizamabad) నగరంలో గోల్ హనుమాన్ నుంచి పూసలగల్లీకి వెళ్లేమార్గంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సి ఉన్న ప్రాంతాలను సైతం కలెక్టర్ పరిశీలించారు. పనులను ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారం, పది రోజుల అనంతరం తాను మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతో పాటు పనుల ప్రగతిని సమీక్షిస్తానన్నారు. కలెక్టర్ వెంట ఆర్​అండ్​బీ అధికారి ప్రవీణ్, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, ఇనాయత్ తదితరులు ఉన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...