అక్షరటుడే, వెబ్డెస్క్: Medak | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మంబోజిపల్లి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ (Mambojipalli NSF Factory) సమీపంలో మెదక్ నుంచి నర్సాపూర్ (narsapur) వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సు కింద ఇరుక్కున్న ఆటోను తొలగించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
