Harish Rao | తెలంగాణ ద్రోహి రేవంత్​రెడ్డి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణ ద్రోహి అని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. సమైక్యవాదులకు కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి పాలేరు సభలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే. టీడీపీ అభిమానులు బీఆర్​ఎస్​ను బొంద పెట్టాలని, గ్రామాల్లో ఆ పార్టీ గద్దెలను కూల్చాలని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలకు ఎక్స్​ వేదికగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణ ద్రోహి అని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. సమైక్యవాదులకు కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అన్నారు.

సీఎం రేవంత్​రెడ్డి పాలేరు సభలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే. టీడీపీ అభిమానులు బీఆర్​ఎస్​ను బొంద పెట్టాలని, గ్రామాల్లో ఆ పార్టీ గద్దెలను కూల్చాలని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలకు ఎక్స్​ వేదికగా హరీశ్​రావు కౌంటర్​ ఇచ్చారు. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ‘ఓటుకు నోటు’ దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి అన్నారు. ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్​లో చేరి, నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి అన్నారు.

Harish Rao | బీజేపీతో దోస్తీ

కేంద్రంలోని బీజేపీతో రేవంత్​రెడ్డి చీకటి స్నేహాలు చేస్తున్నారని హరీశ్​రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల (Banakacherla) లాంటి ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాలకు సపోర్టు చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ సర్కార్​ను వ్యతిరేకిస్తూ ఉంటే.. రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పగలు రాహుల్ గాంధీ జపం చేసే సీఎం, రాత్రి బీజేపీ, టీడీపీతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు.

Harish Rao | దిమ్మతిరిగిలా బదులిస్తాం

బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే అన్నారు. హోమ్ శాఖను నిర్వహిస్తున్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చగొడుతుంటే రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మతిరిగేలా బదులిస్తామని పేర్కొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...