Homeజిల్లాలునిజామాబాద్​Arya Vaishya Sangham | గెలిచిన వారిపై బాధ్యత పెరిగింది: ఎమ్మెల్యే ధన్​పాల్​

Arya Vaishya Sangham | గెలిచిన వారిపై బాధ్యత పెరిగింది: ఎమ్మెల్యే ధన్​పాల్​

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Arya Vaishya Sangham | పట్టణ ఆర్యవైశ్య సంఘంలో గెలిచిన వారిపై బాధ్యత మరింత పెరిగిందని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య పట్టణ సంఘం (Arya Vaishya Urban Association), అనుబంధ సంఘాల అధ్యక్షులు శనివారం ఎమ్మెల్యేను కలిశారు.

Arya Vaishya Sangham | హామీలను అమలు చేయాలి..

ఈ సందర్భంగా ఆయా ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంఘం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.

Arya Vaishya Sangham | ప్రలోభాలకు గురిచేసినప్పటికీ..

అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు (Arya Vaishya Sangam President) ధన్​పాల్​ శ్రీనివాస్ (Dhanpal Srinivas) మాట్లాడుతూ.. ప్రత్యర్థులు ఓటర్లను ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా ధర్మమే గెలిచిందని పేర్కొన్నారు. గెలుపులో కీలకంగా వ్యవహరించిన ఆర్యవైశ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు ఇంగు శివప్రసాద్​, పాల్తి రవికుమార్​, ఇల్లందు సుధాకర్​, లిఖిత్​, వివేకానంద, నవీన్​ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News