C-Mitra | ‘సీ-మిత్ర’కు స్పందన.. పది రోజుల్లో వెయ్యి మందికి ఫోన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : C-Mitra | సైబర్​ నేరాల భారీన పడిన వారికి అండగా ఉండేందుకు పోలీసులు ‘సీ–మిత్ర’ సేవలు (‘C-Mitra’ service) ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి మంచి స్పందన వస్తోంది. సైబర్​ నేరాల్లో (cybercrimes) మోసపోయిన వారు టోల్​ ఫ్రీ నంబర్​, సైబర్​ క్రైం పోర్టల్​లో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడం లేదు. దీంతో వారికి సాయం చేయడానికి, ఎక్కడి నుంచైనా ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడానికి ‘సీ–మిత్ర’ను […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : C-Mitra | సైబర్​ నేరాల భారీన పడిన వారికి అండగా ఉండేందుకు పోలీసులు ‘సీ–మిత్ర’ సేవలు (‘C-Mitra’ service) ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి మంచి స్పందన వస్తోంది.

సైబర్​ నేరాల్లో (cybercrimes) మోసపోయిన వారు టోల్​ ఫ్రీ నంబర్​, సైబర్​ క్రైం పోర్టల్​లో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడం లేదు. దీంతో వారికి సాయం చేయడానికి, ఎక్కడి నుంచైనా ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడానికి ‘సీ–మిత్ర’ను పోలీసులు తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అమల్లోకి వచ్చిన కేవలం పది రోజుల్లోనే వందల మందికి సీ –మిత్ర భరోసా ఇచ్చింది. సీ–మిత్ర పోలీసులు (C-Mitra police) 1000 మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను తెలుసుకుంది.

C-Mitra | 100 ఎఫ్​ఐఆర్​లు నమోదు

బాధితుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) సాయంతో 200 మందికి పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసి పంపింది. వారి నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే.. ఎక్కడా జాప్యం లేకుండా 100 కిపైగా ఎఫ్ఐఆర్​లను నమోదు చేశారు. గంటల తరబడి స్టేషన్లలో పనిలేకుండా, నిమిషాల్లోనే వర్చువల్ పోలీసులు స్పందిస్తుండటం, ఎఫ్ఐఆర్ కాపీలు నేరుగా మొబైల్‌కే వస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...