Kamareddy | శబరిమాత ఆశ్రమంలో విజయదశమి ఏర్పాట్లపై తీర్మానాలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తాడ్వాయిలోని శబరిమాత ఆశ్రమంలో (Sabarimata Ashram) విజయదశమి సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆశ్రమ ట్రస్ట్‌ కమిటీ సభ్యులు పలు తీర్మానాలు చేశారు. ఈ మేరకు ఆశ్రమంలో ట్రస్ట్‌ కమిటీ అధ్యక్షుడు అనంతరావు (Ananth Rao) ఆధ్వర్యంలో శుక్రవారం ట్రస్ట్‌ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ అభివృద్ధి, అన్నదానం, అమ్మవారి నిత్యపూజ (Ammavari Nithya Pooja), తదితర కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వారు […]

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తాడ్వాయిలోని శబరిమాత ఆశ్రమంలో (Sabarimata Ashram) విజయదశమి సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆశ్రమ ట్రస్ట్‌ కమిటీ సభ్యులు పలు తీర్మానాలు చేశారు. ఈ మేరకు ఆశ్రమంలో ట్రస్ట్‌ కమిటీ అధ్యక్షుడు అనంతరావు (Ananth Rao) ఆధ్వర్యంలో శుక్రవారం ట్రస్ట్‌ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశ్రమ అభివృద్ధి, అన్నదానం, అమ్మవారి నిత్యపూజ (Ammavari Nithya Pooja), తదితర కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాతాజీ విజయదశమిన మహా సమాధి దీక్షకు వెళ్లి తిరిగి కార్తీక పౌర్ణమికి (Kartika Pournami) దర్శనం ఇచ్చి భక్తుల కోర్కెలు తీరుస్తారని కమిటీ సభ్యులు తెలిపారు.

అమ్మవారి భక్తులు, శిష్యులు నిత్యాన్నదాన, ఆశ్రమ అభివృద్ధి కార్యక్రమంలో ఆర్థిక సహాయ, సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆశ్రమ గౌరవాధ్యక్షుడు వేముల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి నేతి కృష్ణమూర్తి, కోశాధికారి దూడం శ్రీనివాస్, గ్రామపెద్దలు బాలకిషన్‌ రావు, రాఘవరెడ్డి, డా నర్సింలు, రనీల్‌ రెడ్డి, రాంశంకర్, సాంస్కృతిక కార్యదర్శి లక్ష్మీనారాయణ, భరద్వాజ్, శంకర్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...