Soybean Farmers | సోయాబిన్​ రైతులకు ఊరట.. ఎకరాకు 10 క్వింటాళ్ల సేకరణకు మంత్రి ఆదేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Soybean Farmers | వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సోయాబిన్​ రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పారు. సోయాబీన్ కొనుగోలు పరిమితిని ఎకరాకు 7.62 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచినట్లు ఆయన తెలిపారు. ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని ఆయన మార్క్ ఫెడ్ అధికారులను (Mark Fed Officers) ఆదేశించారు. రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేసినట్లు అంచనా. సోయాబిన్​ కొనుగోలు కోసం ప్రభుత్వం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Soybean Farmers | వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సోయాబిన్​ రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పారు. సోయాబీన్ కొనుగోలు పరిమితిని ఎకరాకు 7.62 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచినట్లు ఆయన తెలిపారు. ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని ఆయన మార్క్ ఫెడ్ అధికారులను (Mark Fed Officers) ఆదేశించారు.

రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేసినట్లు అంచనా. సోయాబిన్​ కొనుగోలు కోసం ప్రభుత్వం గతంలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. క్వింటాల్​కు రూ.5,328 మద్దతు ధరతో మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే మొదట ఎకరాకు 7.62 క్వింటాళ్ల సోయాలను మాత్రమే కొనుగోలు చేశారు. దీనిపై రైతులు విజ్ఞప్తి మేరకు తాజాగా పది క్వింటాళ్లకు పెంచారు. అలాగే కౌలు రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఆధార్ అథెంటికేషన్​తో పాటు మొబైల్ OTPతో కూడా కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి (Tummala Nageswara Rao) ఆదేశించారు.

Soybean Farmers | ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ ప్రక్రియ సాగుతోంది. దీంతో రైతులు (Soybean Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చలితీవ్రత పెరిగింది. సాయంత్రం ఆరు అయిందంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. కానీ ధాన్యం కేంద్రాల్లో రైతులు చలిలో సైతం కాపలా పడుకుంటున్నారు. దీంతో అనారోగ్యానికి గురి అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు పలు చోట్ల లారీలు సక్రమంగా రావడం లేదు. మిల్లర్లు తరుగు పేరిట లారీ కొన్ని బస్తాలను కట్ చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...