Minister Ponguleti | రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Ponguleti | స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. కూకట్​పల్లి (Kukatpally)లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం అందుకు నిదర్శనమని చెప్పారు. ప్ర‌భుత్వంపై భారం లేకుండా ప్రైవేట్ బిల్డర్స్ సహకారంతో స‌మీకృత భ‌వ‌నాల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఐదేళ్ల పాటు వాటి నిర్వహణను […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Ponguleti | స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. కూకట్​పల్లి (Kukatpally)లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం అందుకు నిదర్శనమని చెప్పారు. ప్ర‌భుత్వంపై భారం లేకుండా ప్రైవేట్ బిల్డర్స్ సహకారంతో స‌మీకృత భ‌వ‌నాల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఐదేళ్ల పాటు వాటి నిర్వహణను సైతం బిల్డర్లే చూసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆలోచనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ శాఖను అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టామన్నారు. కూకట్​పల్లి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎస్.ఎస్.ఆర్ బిల్డర్స్ నిర్మిస్తుందని మంత్రి తెలిపారు.

Minister Ponguleti | ఆధునిక సౌకర్యాలతో..

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను (Sub-Registrar Offices) నిర్మిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. మొదటి విడతలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో, మూడో విడతలో నియోజకవర్గ కేంద్రాలలో సమీకృత భవనాలు నిర్మిస్తామన్నారు. తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా కాకుండా సేవా కేంద్రంగా చూస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatela Rajender), కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, జీహెచ్​ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...