Sriramsagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు తగ్గిన ఇన్​ఫ్లో..

అక్షరటుడే, మెండోరా: Sriramsagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు (Sriramsagar Project) ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గింది. దీంతో బుధవారం ఉదయం 16 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు.. మధ్యాహ్నానికి గేట్ల సంఖ్యను తగ్గించారు. ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి గోదావరిలోకి (Godavari) నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 35,000 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 34,790 క్యూసెక్కుల అవుట్​ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం […]

అక్షరటుడే, మెండోరా: Sriramsagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు (Sriramsagar Project) ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గింది. దీంతో బుధవారం ఉదయం 16 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు.. మధ్యాహ్నానికి గేట్ల సంఖ్యను తగ్గించారు. ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి గోదావరిలోకి (Godavari) నీటిని విడుదల చేశారు.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి 35,000 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 34,790 క్యూసెక్కుల అవుట్​ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.90 అడుగులకు (80.053 టీఎంసీలు) చేరింది.

Sriramsagar | కాల్వల ద్వారా నీటి విడుదల

ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా నీటి విడుదలను అధికారులు కొనసాగిస్తున్నారు. కాకతీయ కాలువ (Kakatiya kaluva) ద్వారా 4,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 709 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది.

Sriramsagar | అప్రమత్తంగా ఉండాలి

ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో గోదావరి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు, చేపల వేటగాళ్లు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. అలాగే అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటి విడుదల తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...