Home » Hyderabad | హైదరాబాద్​లో రియల్టర్​ దారుణ హత్య

Hyderabad | హైదరాబాద్​లో రియల్టర్​ దారుణ హత్య

హైదరాబాద్​లో రియల్టర్​ దారుణ హత్యకు గురయ్యాడు. జవహర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సాకేత్​ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

by spandana
0 comments
Hyderabad

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​లో మరో రియల్టర్​ దారుణ హత్యకు గురయ్యాడు. జవహర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్​ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అందరు చూస్తుండగా నిందితులు రియల్టర్​ను తుపాకితో కాల్చి, కత్తులతో పొడిచి హత్య చేశారు. రియల్టర్‌ వెంకటరత్నం స్కూటీపై వెళ్తున్నాడు. అతడిని దుండగులు వెంబడించారు. సాకేత్​ కాలనీలోని ఫోస్టర్​ స్కూల్​ (Foster School) సమీపంలోకి రాగానే అతడిపై దాడి చేశారు. నడిరోడ్డుపై షూట్‌ చేశారు. అనంతరం కత్తులతో పొడిచి హత్య చేశారు.

Hyderabad | కేసు నమోదు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంకటరత్నంను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో బుల్లెట్‌తో పాటు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కాగా వెంకటరత్నంపై ధూల్‌పేట్‌ (Dhulpet)లో రౌడీషీట్‌ ఉన్నట్లు గుర్తించారు.

Hyderabad | వరుస ఘటనలు

నగరంలో ఇటీవల హత్యలు, దాడులు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పాతబస్తీలోని రెయిన్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ (Rain Bazaar Police Station) పరిధిలో సైతం ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి హత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్‌కు చెందిన మహమ్మద్ జునైద్‌ (30)ను బుధవారం అర్ధరాత్రి దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.

You may also like