Hyderabad | రియల్​ ఎస్టేట్​ వ్యాపారి దారుణ హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పాతబస్తీలోని రెయిన్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ (Rain Bazaar Police Station) పరిధిలో చోటు చేసుకుంది. రెయిన్ బజార్‌ (Rain Bazaar)కు చెందిన మహమ్మద్ జునైద్‌ (30) రియల్ ఎస్టేట్​ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి అతడిని దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. దీంతో జునైద్​కు తీవ్ర గాయాలు అయ్యాయి. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పాతబస్తీలోని రెయిన్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ (Rain Bazaar Police Station) పరిధిలో చోటు చేసుకుంది.

రెయిన్ బజార్‌ (Rain Bazaar)కు చెందిన మహమ్మద్ జునైద్‌ (30) రియల్ ఎస్టేట్​ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి అతడిని దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. దీంతో జునైద్​కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ జునైద్​ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital)కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad | హత్యకు కారణం అదేనా

జునైద్​ను హత్య చేసింది అతడి బంధువులేనని పోలీసులు గుర్తించారు. నిందితులు ఒమర్, అలీలు కలిసి అతడిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. వీరి మధ్య కొంతకాలంగా వ్యాపార లావాదేవిల విషయమై గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఓ ఇంటి అమ్మకంపై కొంత కాలంగా జునైద్, ఒమర్​ల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి మాట్లాడుకుందామని జునైద్​ను ఒమర్​, అలీ చోటాపూర్​కు పిలిపించారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరగడంతో కత్తులతో జునైద్​పై దాడి చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Hyderabad | పెరుగుతున్న నేరాలు

హైదరాబాద్​ నగరంలో నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఓ ఏసీపీ, గన్​మన్​పై రౌడీ షీటర్​ కత్తితో దాడికి యత్నించారు. పోచారం గోరక్షకుడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. బాలానగర్​ పీఎస్​ పరిధిలో ఓ రౌడీ షీటర్​పై మరో రౌడీ షీటర్​ కత్తితో దాడి చేశాడు. ఇలా నగరంలో కత్తిపోట్లు, కాల్పుల ఘటనలు తరచూ జరుగుతుండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ (Hyderabad CP Sajjanar) నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇటీవల ఆయన పలువురు పాత నేరస్తులను బైండోవర్ చేశారు. నేరాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...