Nizamabad City | ఐటీఐ కళాశాల ప్రాంగణంలో రంగవల్లుల సందడి

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని ఐటీఐ కళాశాల మైదానం సోమవారం రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది. సంస్కార భారతి ఇందూరు శాఖ, ఇండియన్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలు, కళాశాల విద్యార్థులకు భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు (rangoli competition) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని షీ టీం ఎస్సై స్రవంతి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. Nizamabad City | ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి ఎస్సై స్రవంతి (Sub-Inspector Sravanthi) మాట్లాడుతూ, మహిళలు, విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని ఐటీఐ కళాశాల మైదానం సోమవారం రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది. సంస్కార భారతి ఇందూరు శాఖ, ఇండియన్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలు, కళాశాల విద్యార్థులకు భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు (rangoli competition) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని షీ టీం ఎస్సై స్రవంతి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.

Nizamabad City | ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

ఎస్సై స్రవంతి (Sub-Inspector Sravanthi) మాట్లాడుతూ, మహిళలు, విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో ఆకతాయిల వేధింపులు ఉన్నా.. మొబైల్ ఫోన్ ద్వారా ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. విద్యార్థినుల రక్షణ కోసం షీ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాజ్ కుమార్ సుబేదార్​తో పాటు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో సంస్కార భారతి చేస్తున్న కృషిని కొనియాడారు.

ఇలాంటి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు తమ కళాశాల ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎం. సాయి తరుణ్ మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల బిజీ షెడ్యూల్‌లో కూడా సంప్రదాయాలను మర్చిపోకుండా ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో బ్యాంకు తరపున పూర్తి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ నగుర్తి శంకర్, సాహిత్య విధా ప్రముఖ్ జి. ప్రసాద్, ప్రాంత కార్యదర్శి చామకూర శ్రీనివాస్ రెడ్డి, బి. మల్లేష్, రాధాకృష్ణ, కందకుర్తి ఆనంద్, నాగనాథ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.  మహిళా శక్తి కన్వీనర్ మాధురి, ఉపాధ్యక్షులు వరలక్ష్మి, శశిరేఖ, మాధవి, శ్రీలత తదితర సంస్కార భారతి సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...