Telangana Raj Bhavan | రాజ్‌భవన్ పేరు మార్పు.. ఇక నుంచి లోక్ భవన్‌..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Raj Bhavan | తెలంగాణ రాజ్​భవన్​ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. రాజభవన్​ పేరును ‘లోక్​భవన్’గా (Lok Bhavan) మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Telangana Raj Bhavan | ప్రధాన మంత్రి మంత్రి కార్యాలయం పేరు మార్పు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం (NDA government) మరో కీలక నిర్ణయం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Raj Bhavan | తెలంగాణ రాజ్​భవన్​ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. రాజభవన్​ పేరును ‘లోక్​భవన్’గా (Lok Bhavan) మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana Raj Bhavan | ప్రధాన మంత్రి మంత్రి కార్యాలయం పేరు మార్పు

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం (NDA government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్ల అధికారిక నివాసగృహాల పేర్లను మార్చింది. ఇప్పటివరకు ‘రాజ్ భవన్’గా పిలుచుకునే ఈ భవనాలను ఇకపై ‘లోక్ భవన్’ అని పిలుస్తారు. ఈ మార్పుతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును కూడా కేంద్ర గృహ నిర్మాణ శాఖ మార్చింది. ఇకపై ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ‘సేవాతీర్థ్’ అని అధికారికంగా పిలవనున్నారు.

కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ‘రాజ్ భవన్’, ‘పీఎంఓ’ వంటి పేర్లు బ్రిటిష్ వలస పాలన ఛాయలను ప్రతిబింబిస్తాయని పేర్కొంది. అందుకే స్వాతంత్య్రానంతర భారత్‌లో ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా కొత్త పేర్లను ఎంచుకున్నట్టు ప్రకటించింది. ‘లోక్ భవన్’ అంటే ప్రజల భవనం, ‘సేవాతీర్థ్’ అంటే సేవా క్షేత్రమనే అర్థాలు వస్తాయని అధికార వర్గాలు వివరించాయి.

ఈ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే పలు రాష్ట్రాలు స్పందించాయి. పశ్చిమ బెంగాల్, త్రిపురా, అస్సాం, కేరళ వంటి రాష్ట్రాలు డిసెంబర్ 1 నుంచే కొత్త పేరుతో సైన్‌బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లు, లేఖల పత్రికలను మార్చేశాయి. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ వంటి ప్రతిపక్ష పార్టీలు ఈ చర్యను “కేంద్రం రాష్ట్రాల హక్కుల దాడి”గా అభివర్ణించాయి. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశవ్యాప్తంగా ఈ పేరు మార్పు అమలు ఎలా ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...