HomeతెలంగాణRailway Trial Run | సిద్దిపేట – చిన్నకోడురు మధ్య రైల్వే ట్రయల్​ రన్​

Railway Trial Run | సిద్దిపేట – చిన్నకోడురు మధ్య రైల్వే ట్రయల్​ రన్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Trial Run | మనోహరాబాద్ (Manoharabad)​ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్​ పనులు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిద్దిపేట నుంచి చిన్న కోడూరు (Chinna Kodur) వరకు 15 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్​ నిర్మాణం పూర్తయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ట్రాక్​పై ట్రయల్ రన్​ నిర్వహించారు.

హైదరాబాద్​ నగరం నుంచి కరీనంగర్​ జిల్లాకు (Karinangar District) కనెక్టివిటీ కల్పించడానికి మనోహరాబాద్​ – కొత్తపల్లి రైల్వేలైన్​ నిర్మిస్తునారు. మెదక్​ జిల్లాలోని మనోహరాబాద్​ నుంచి గజ్వేల్​, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్​లోని కొత్తపల్లి వరకు రైల్వేలైన్ పనులు సాగుతున్నాయి. 2016లో పనులు ప్రారంభం కాగా.. పూర్తవడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.

Railway Trial Run | వేగంగా పనులు

మనోహరాబాద్ ​– కొత్తపల్లి రైల్వే పనులు ఇప్పటికే 50 శాతం పైగా పూర్తయ్యాయి. సిరిసిల్ల సమీపంలో రైల్వే పట్టాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కొత్తపల్లి (కరీంనగర్) వరకు చేరడానికి మరొక మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్​ నుంచి ఢిల్లీ, ఉత్తరాది నగరాలకు ప్రత్యామ్న్యాయ మార్గం అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్​ నుంచి ఢిల్లీ వెళ్లాలంటే కాజీపేట – పెద్దపల్లి మీదుగా వెళ్లాల్సి వస్తుంది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి మార్గం అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో సైతం పలు రైళ్లు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.

Railway Trial Run | ప్రముఖ పుణ్యక్షేత్రాలు

కొత్తపల్లి–మనోహరాబాద్​ రైల్వే లైన్ ప్రముఖ పుణ్యక్షేత్రాల మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో కొమురవెల్లి మల్లన్న ఆలయం (Komuravelli Mallanna Temple), వర్గల్ సరస్వతి దేవి ఆలయం (Vargal Saraswati Devi Temple), వేములవాడ రాజన్న ఆలయాలు (Vemulawada Rajanna Temple) ఉన్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల మేర రైల్వేలైన్​ వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 90 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. మిగతా పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో భూసేకరణ పనులు కూడా పూర్తయ్యాయి అని సమాచారం. వేములవాడలోని మానేరు నది మీద సుమారుగా 2 కిలోమీటర్ల రైల్వే వంతెన నిర్మించడానికి ప్రతిపాదనలు కూడా చేశారు.
ప్రస్తుతం ఈ మార్గంలో సిద్దిపేట వరకు రైల్వే లైన్​ పూర్తవడంతో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. పూర్తి మార్గం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే వేములవాడ, కొమురవెల్లి మల్లన్న ఆలయాలకు వచ్చే భక్తులకు సైతం రవాణా సౌకర్యం మెరుగవుతంది.