ePaper
More
    HomeతెలంగాణRailway Trial Run | సిద్దిపేట – చిన్నకోడురు మధ్య రైల్వే ట్రయల్​ రన్​

    Railway Trial Run | సిద్దిపేట – చిన్నకోడురు మధ్య రైల్వే ట్రయల్​ రన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Trial Run | మనోహరాబాద్ (Manoharabad)​ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్​ పనులు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిద్దిపేట నుంచి చిన్న కోడూరు (Chinna Kodur) వరకు 15 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్​ నిర్మాణం పూర్తయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ట్రాక్​పై ట్రయల్ రన్​ నిర్వహించారు.

    హైదరాబాద్​ నగరం నుంచి కరీనంగర్​ జిల్లాకు (Karinangar District) కనెక్టివిటీ కల్పించడానికి మనోహరాబాద్​ – కొత్తపల్లి రైల్వేలైన్​ నిర్మిస్తునారు. మెదక్​ జిల్లాలోని మనోహరాబాద్​ నుంచి గజ్వేల్​, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్​లోని కొత్తపల్లి వరకు రైల్వేలైన్ పనులు సాగుతున్నాయి. 2016లో పనులు ప్రారంభం కాగా.. పూర్తవడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.

    Railway Trial Run | వేగంగా పనులు

    మనోహరాబాద్ ​– కొత్తపల్లి రైల్వే పనులు ఇప్పటికే 50 శాతం పైగా పూర్తయ్యాయి. సిరిసిల్ల సమీపంలో రైల్వే పట్టాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కొత్తపల్లి (కరీంనగర్) వరకు చేరడానికి మరొక మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్​ నుంచి ఢిల్లీ, ఉత్తరాది నగరాలకు ప్రత్యామ్న్యాయ మార్గం అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్​ నుంచి ఢిల్లీ వెళ్లాలంటే కాజీపేట – పెద్దపల్లి మీదుగా వెళ్లాల్సి వస్తుంది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి మార్గం అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో సైతం పలు రైళ్లు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.

    Railway Trial Run | ప్రముఖ పుణ్యక్షేత్రాలు

    కొత్తపల్లి–మనోహరాబాద్​ రైల్వే లైన్ ప్రముఖ పుణ్యక్షేత్రాల మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో కొమురవెల్లి మల్లన్న ఆలయం (Komuravelli Mallanna Temple), వర్గల్ సరస్వతి దేవి ఆలయం (Vargal Saraswati Devi Temple), వేములవాడ రాజన్న ఆలయాలు (Vemulawada Rajanna Temple) ఉన్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల మేర రైల్వేలైన్​ వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 90 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. మిగతా పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో భూసేకరణ పనులు కూడా పూర్తయ్యాయి అని సమాచారం. వేములవాడలోని మానేరు నది మీద సుమారుగా 2 కిలోమీటర్ల రైల్వే వంతెన నిర్మించడానికి ప్రతిపాదనలు కూడా చేశారు.
    ప్రస్తుతం ఈ మార్గంలో సిద్దిపేట వరకు రైల్వే లైన్​ పూర్తవడంతో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. పూర్తి మార్గం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే వేములవాడ, కొమురవెల్లి మల్లన్న ఆలయాలకు వచ్చే భక్తులకు సైతం రవాణా సౌకర్యం మెరుగవుతంది.

    Latest articles

    Kamareddy Collector | మున్సిపాలిటీలో డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Collector | మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...

    Delhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేసా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి పాల్పడిన రాజేష్ ఖిమ్జీ...

    Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి దిగువకు నీటి విడుదల...

    Jagadeesh Reddy | క‌మీష‌న్ల కోస‌మే యూరియా కొర‌త‌.. కాంగ్రెస్ చేత‌గానిత‌నంతోనే రైతుల‌కు క‌ష్టాలన్న జ‌గ‌దీష్‌రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagadeesh Reddy | కాంగ్రెస్ ప్ర‌భుత్వ చేత‌గానితనంతోనే యూరియా కొర‌త ఏర్ప‌డింద‌ని మాజీ మంత్రి...

    More like this

    Kamareddy Collector | మున్సిపాలిటీలో డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Collector | మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...

    Delhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేసా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి పాల్పడిన రాజేష్ ఖిమ్జీ...

    Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి దిగువకు నీటి విడుదల...