అక్షరటుడే, ఇందూరు: Railway Gate | రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో నవీపేట్ రైల్వేగేట్ను (Navipet railway gate) రెండురోజుల పాటు మూసివేయనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బి.శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 3వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రైల్వేగేట్ను మూసివేయనున్నారు.
Railway Gate | వాహనాల దారి మళ్లింపు..
రైల్వేగేట్ మూసివేత నేపథ్యంలో నిజామాబాద్ నుండి బాసర, భైంసా,ధర్మాబాద్ వైపు వెళ్లే వాహనదారులు జన్నేపల్లి మీదుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే బాసర నుండి జానకంపేట, బోధన్ వైపు వెళ్లే వాహనదారులు ఫకీరాబాద్-సాటాపూర్-సాటాపూర్ గేట్ మీదుగా వెళ్లాలన్నారు. బాసర నుంచి నిజామాబాద్ వెళ్లే వాహనదారులు జన్నేపల్లి మీదుగా వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పనులను (railway work) వాహనదారులు సహకరించాలని కోరారు.