Raheja investment in visakhapatnam | విశాఖ‌ప‌ట్నంలో మ‌రో భారీ పెట్టుబ‌డి.. రూ.2,172 కోట్లు ఇన్వెస్ట్​ చేయబోతున్న నిర్మాణ దిగ్గజం Raheja

అక్షరటుడే, అమరావతి: Raheja investment in visakhapatnam | విశాఖపట్నంలో ప్రముఖ నిర్మాణ దిగ్గజం కె. రహేజా కార్పొరేషన్ ఐటీ కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.2,172.26 కోట్లతో వాణిజ్య, నివాస భవనాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ మధురవాడ ఐటీ హిల్‌లో 27.10 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. విశాఖపట్నం Vishakapatnam ఐటీ రంగంలో మరో కీల‌క‌ అడుగు పడనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్ నగరంలో […]

అక్షరటుడే, అమరావతి: Raheja investment in visakhapatnam | విశాఖపట్నంలో ప్రముఖ నిర్మాణ దిగ్గజం కె. రహేజా కార్పొరేషన్ ఐటీ కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.2,172.26 కోట్లతో వాణిజ్య, నివాస భవనాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ మధురవాడ ఐటీ హిల్‌లో 27.10 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.

విశాఖపట్నం Vishakapatnam ఐటీ రంగంలో మరో కీల‌క‌ అడుగు పడనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్ నగరంలో భారీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఐటీ కంపెనీల అవసరాలకు తగిన వాణిజ్య, నివాస భవనాల నిర్మాణం కోసం రూ.2,172.26 కోట్ల పెట్టుబడిని పెట్టబోతున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఈ ప్రాజెక్ట్ కోసం రహేజా గ్రూప్ మధురవాడ ఐటీ హిల్ నంబర్-3లో 27.10 ఎకరాల భూమిని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాదాపు 9,681 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సంస్థ తెలిపింది.

Raheja investment in visakhapatnam | రెండు దశల్లో నిర్మాణం

రహేజా Raheja కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టనుంది. మొదటి దశ: 2028 నాటికి వాణిజ్య భవనాలు పూర్తవుతాయి. ఇందుకోసం రూ.663.42 కోట్లు వెచ్చించి, .59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయనున్నారు.

రెండో దశలో 2031 నాటికి వాణిజ్య భవనాలు, 2035 నాటికి నివాస సముదాయాలు పూర్తవుతాయి. దీనికి రూ.1,418.84 కోట్లు ఖర్చు చేసి, 19.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరగనున్నాయి.

ఇటీవలే గూగుల్ సంస్థ విశాఖలో ఏఐ డేటా సెంటర్ AI Data Centre ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే మిలీనియం టవర్స్ లో కార్యాలయాలు ప్రారంభించాయి.

కొత్తగా రాబోయే కంపెనీలకు అవసరమైన ఆఫీస్ స్పేస్‌ను అందించేందుకు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు చురుకుగా ముందుకు వస్తున్నాయి. రహేజా సంస్థ 2028 నాటికి వాణిజ్య నిర్మాణాలను, 2030 నాటికి నివాస సముదాయాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విశాఖపట్నం ఐటీ IT రంగం మరింత వేగంగా ఎదగనుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా, ఈ ప్రాజెక్టుతో Project విశాఖ ఐటీ సిటీగా మారే దిశలో మరో కీలక అడుగు పడనుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...