SP Rajesh Chandra | పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి: ఎస్పీ రాజేష్ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | పోలీసు శాఖలో (Police Department) పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో (Sadashivanagar Police Station) హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఏఎస్సైగా పదోన్నతి పొందిన డి.దేవరాజు ఎస్పీని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి చిహ్నాలను అలంకరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. SP Rajesh Chandra | క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలి.. అనంతరం […]

అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | పోలీసు శాఖలో (Police Department) పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో (Sadashivanagar Police Station) హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఏఎస్సైగా పదోన్నతి పొందిన డి.దేవరాజు ఎస్పీని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి చిహ్నాలను అలంకరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

SP Rajesh Chandra | క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలి..

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయన్నారు. పదోన్నతులు కేవలం హోదా మార్పు మాత్రమే కాదని, విధి నిర్వహణలో బాధ్యతను మరింత పెంచుతుందని తెలిపారు. పదోన్నతి పొందిన సిబ్బంది తమ జీవనశైలిని మెరుగుపరుచుకుని ప్రజలకు మరింత చేరువగా ఉండి నిజాయితీతో సేవలు అందించాలని సూచించారు. ఈ మధ్య సైబర్​ నేరాలు (Cyber ​​Crimes) ఎక్కువగా జరుగుతున్నాయని వాటిని అరికట్టేవిధంగా ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అరైవ్​ అలైవ్’​ కార్యక్రమాన్ని (Arrive Alive Program) విజయవంతం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...