అక్షరటుడే ఇందూరు: KITS | కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో (Kakatiya Women’s Engineering College) వారం రోజులుగా కొనసాగుతున్న ‘స్మార్ట్ ఐఓటీ సిస్టమ్స్’ (Smart IOT Systems) ట్రైనింగ్ ప్రోగ్రాం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సెల్వ కుమార్ రాజా Principal Dr. Selva Kumar Raja మాట్లాడుతూ.. ఇలాంటి ప్రాజెక్టుల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. పరిశోధనపై ఆసక్తి కలుగుతుందన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సాయ రెడ్డి, ఆయా విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.
