PM Modi | రూల్స్​ ప్రజలను వేధించడానికి కాదు.. ఇండిగో సంక్షోభంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా వేలాది విమానాలు రద్దు అయి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఇండిగో విమానాల (Indigo Flights) రద్దు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. నిబంధనలు వ్యవస్థల బాగు కోసమేనని, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ఎన్డీఏ మిత్రపక్ష సమావేశంలో మాట్లాడరని కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజ్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా వేలాది విమానాలు రద్దు అయి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఇండిగో విమానాల (Indigo Flights) రద్దు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

నిబంధనలు వ్యవస్థల బాగు కోసమేనని, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ఎన్డీఏ మిత్రపక్ష సమావేశంలో మాట్లాడరని కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజ్​ (Union Minister Kiren Rijij) తెలిపారు. ప్రభుత్వం కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా చూసుకోవాలన్నారు. నియమాలు, నిబంధనలు మంచివి, కానీ అవి వ్యవస్థను మెరుగుపరచడానికి అన్నారు. ప్రజలను వేధించడానికి కాదని స్పష్టం చేశారు. సాధారణ పౌరులను ఇబ్బంది పెట్టే చట్టం, నిబంధన ఉండకూడదని ప్రధానమంత్రి మోదీ (PM Modi) చెప్పారు. చట్టాలు ప్రజలపై భారంగా ఉండకూడదన్నారు.

PM Modi | కొనసాగుతున్న సంక్షోభం

ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. మంగళవారం సైతం పలు విమానాలు రద్దు అయ్యాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇండిగో విమానాల రద్దు పర్వం రెండో వారంలోకి అడుగుపెట్టగా, మంగళవారం దాదాపు 500 విమానాలు నిలిచిపోయాయి. ఢిల్లీ మరియు బెంగళూరు వరుసగా 152 మరియు 121 విమానాలు రద్దు చేసుకోవడంతో అత్యధిక నష్టాలను చవిచూశాయి. చెన్నై (81), హైదరాబాద్ (58), ముంబై (31), లక్నో (26), మరియు అహ్మదాబాద్ (16)లలో విమానాలు రద్దు అయ్యాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...