PM Modi | శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆంధ్రప్రదేశ్​ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం (Srisailam Mallikarjuna Swamy Temple)లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రధాని రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. ఆయన వెంట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Deputy CM Pawan Kalyan) […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆంధ్రప్రదేశ్​ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం (Srisailam Mallikarjuna Swamy Temple)లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

స్వామివారికి ప్రధాని రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. ఆయన వెంట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Deputy CM Pawan Kalyan) ఉన్నారు.శ్రీశైలం ఆలయ సందర్శనపై మోదీ ఎక్స్​ వేదికగా స్పందించారు.“శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని పోస్ట్​ చేశారు.

PM Modi | శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన

శ్రీశైలంలోని శివాజీ ధ్యాన మందిరం, శివాజీ దర్బార్ హాల్​ను ప్రధాని సందర్శించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677 లో శ్రీశైలం వచ్చారని ప్రధాని పేర్కొన్నారు. శ్రీశైలం పర్యటన అనంతరం ప్రధాని కర్నూల్ చేరుకున్నారు. నన్నూరు దగ్గర 400 ఎకరాల్లో ప్రధాని మోదీ (PM Modi)బహిరంగ సభ నిర్వహించనున్నారు. 3 లక్షల మందితో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో బహిరంగ సభను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని రూ.13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

PM Modi | కట్టుదిట్టమైన భద్రత

మోదీ సభ ప్రాంగణం 50 ఎకరాల్లో ఉంటుంది. 360 ఎకరాల్లో 12 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. దాదాపు 7 వేల బస్సుల్లో జనాన్ని సమీకరించారు. 7,500మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ సభా వేదిక మీదకు చేరుకున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...