Polavaram project | పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోడీ సమీక్ష.. హాజరుకానున్న రేవంత్​, చంద్రబాబు

అక్షరటుడే, హైదరాబాద్: Polavaram project : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) పోలవరంపై దృష్టి సారించినట్లు తెలిసింది. జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోలవరం ప్రాజెక్టుపై మే 28న ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఒడిశా(Odisha), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సీఎంలతో […]

అక్షరటుడే, హైదరాబాద్: Polavaram project : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) పోలవరంపై దృష్టి సారించినట్లు తెలిసింది. జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోలవరం ప్రాజెక్టుపై మే 28న ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఒడిశా(Odisha), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సీఎంలతో మాట్లాడనున్నట్లు తెలిసింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని ప్రధాని తొలిసారి సమీక్షించబోతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

2027 నాటికి పోలవరం జలాశయ నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కాగా, పోలవరం బ్యాక్ వాటర్​తో ఏర్పడే ముంపుపై తెలంగాణ ఆందోళన లేవనెత్తుతోంది. ఇదే విషయాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ(Ministry of Jal Shakti), కేంద్ర జల సంఘం(Central Water Commission) దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సైతం ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ మేరకు నాలుగు రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన, పనుల పురోగతిని ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. గడువులోగా పనులు పూర్తి చేయడంపై ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడుతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...