PM Modi | 16న ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్​ ఇదే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్​లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఏపీలోని కర్నూల్(Kurnool)​కు మోదీ రానున్నారు. గురువారం ఉదయం 7.50 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వస్తారు. ఉదయం 10.20కు కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో సున్నిపెంటకు వెళ్లారు. అనంతరం ఉదయం 11.10 కి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు ప్రధాని చేరకుంటారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్​లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది.

ఏపీలోని కర్నూల్(Kurnool)​కు మోదీ రానున్నారు. గురువారం ఉదయం 7.50 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వస్తారు. ఉదయం 10.20కు కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో సున్నిపెంటకు వెళ్లారు. అనంతరం ఉదయం 11.10 కి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు ప్రధాని చేరకుంటారు. అనంతరం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి(Srisailam Mallikarjuna Swamy)ని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి సున్నిపెంట చేరుకొని హెలిక్యాప్టర్​లో రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో మాట్లాడతారు.

కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు(GST Reforms) అమలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ పేరిట సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి లోకేశ్‌ సైతం మాట్లాడతారు. అనంతరం ప్రధాని సాయంత్రం 4.15 గంటలకు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్​లో కర్నూల్​ ఎయిర్​పోర్టుకు వెళ్తారు. అనంతరం సాయంత్రం 4.40కు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయలు దేరుతారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...