Homeఆంధప్రదేశ్PM Modi | 16న ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్​ ఇదే..

PM Modi | 16న ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్​ ఇదే..

PM Modi | కర్నూల్​ జిల్లాలో ఈ నెల 16న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు చేస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్​ వెలువడింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్​లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది.

ఏపీలోని కర్నూల్(Kurnool)​కు మోదీ రానున్నారు. గురువారం ఉదయం 7.50 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వస్తారు. ఉదయం 10.20కు కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో సున్నిపెంటకు వెళ్లారు. అనంతరం ఉదయం 11.10 కి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు ప్రధాని చేరకుంటారు. అనంతరం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి(Srisailam Mallikarjuna Swamy)ని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి సున్నిపెంట చేరుకొని హెలిక్యాప్టర్​లో రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో మాట్లాడతారు.

కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు(GST Reforms) అమలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ పేరిట సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి లోకేశ్‌ సైతం మాట్లాడతారు. అనంతరం ప్రధాని సాయంత్రం 4.15 గంటలకు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్​లో కర్నూల్​ ఎయిర్​పోర్టుకు వెళ్తారు. అనంతరం సాయంత్రం 4.40కు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయలు దేరుతారు.