PM Modi | ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ట్రినిడాడ్ & టొబాగో అత్యున్నత పౌర పురస్కారం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి అరుదైన గౌరవం లభించింది. ట్రినిడాడ్ & టొబాగో (Trinidad & Tobago) అత్యున్నత పౌర పురస్కారం వరించింది. కరేబియన్ దేశం (Caribbean country) సందర్శనలో ఉన్న మోదీకి శుక్రవారం(జులై 4) ట్రినిడాడ్ & టొబాగో యొక్క అత్యున్నత పురస్కారం లభించింది. ప్రపంచ నాయకత్వం, భారతీయ ప్రవాసులతో చురుకైన సంబంధం, కొవిడ్ టైంలో మానవతావాద సహకారం.. తదితరాలను గుర్తించి, మోడీకి “ది […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి అరుదైన గౌరవం లభించింది. ట్రినిడాడ్ & టొబాగో (Trinidad & Tobago) అత్యున్నత పౌర పురస్కారం వరించింది. కరేబియన్ దేశం (Caribbean country) సందర్శనలో ఉన్న మోదీకి శుక్రవారం(జులై 4) ట్రినిడాడ్ & టొబాగో యొక్క అత్యున్నత పురస్కారం లభించింది.

ప్రపంచ నాయకత్వం, భారతీయ ప్రవాసులతో చురుకైన సంబంధం, కొవిడ్ టైంలో మానవతావాద సహకారం.. తదితరాలను గుర్తించి, మోడీకి “ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ & టొబాగో” “The Order of the Republic of Trinidad & Tobago” ప్రదానం చేశారు. ఇలా ఒక విదేశీ నేతకు ఆ దేశం ఈ పురస్కారం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.

PM MODI | ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఏమన్నారంటే..

“140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని నేను స్వీకరిస్తున్నా..” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్​ ట్రినిడాడ్ & టొబాగో మధ్య బలమైన స్నేహాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ పురస్కారాన్ని విలువలు, చరిత్ర, సాంస్కృతిక సంబంధాల ప్రతిబింబంగా వర్ణించారు.

PM MODI | చారిత్రాత్మక పర్యటన..

ట్రినిడాడ్ & టొబాగోలో ప్రధానమంత్రి మోదీకి ఇది మొదటి పర్యటన. 1999 తర్వాత ఆ దేశానికి భారత ప్రధానమంత్రి చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన కూడా కావడం విశేషం. ఈ సందర్భంగా భారత్​ ప్రైమ్​ మినిస్టర్​ మోదీకి ఈ అవార్డును ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్-బిస్సేసర్ (Prime Minister Kamla Persad-Bissessar) ప్రకటించారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...