RTA Yellareddy | రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: RTA Yellareddy | రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​ రఫీ (Motor Vehicle Inspector Rafi) అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ (District Transport Department) ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. RTA Yellareddy | ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలి ప్రతి విద్యార్థి ప్రథమ చికిత్సపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని  […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: RTA Yellareddy | రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​ రఫీ (Motor Vehicle Inspector Rafi) అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ (District Transport Department) ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.

RTA Yellareddy | ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలి

ప్రతి విద్యార్థి ప్రథమ చికిత్సపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని  ఎంవీఐ రఫీ సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడడంలో ‘గోల్డెన్ అవర్’ అత్యంత కీలకమని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాద (road accident) బాధితులకు సహాయం చేసే గుడ్ సమారిటన్‌లకు ప్రభుత్వం కల్పిస్తున్న చట్టపరమైన రక్షణలు, ప్రోత్సాహకాలు గురించి వివరించారు.

సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి ఇర్షాద్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు తెలుసుకున్న ట్రాఫిక్​ నిబంధనలను తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్​ మోటార్​ వెహికిల్ ఇన్​స్పెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...