Ponguleti son Raghava | గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు రాఘవ కంపెనీపై కేసు నమోదు

అక్షరటుడే, హైదరాబాద్​: Ponguleti son Raghava | భూకబ్జాకు యత్నించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కుమారుడి కంపెనీపై కేసు నమోదైంది. గచ్చిబౌలిలో 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పొంగులేటి కొడుకు రాఘవ యత్నించారు. అడ్డుకున్న భూ యజమానిపై పొక్లెయిన్​తో దాడి చేశారు. గత నాలుగు రోజులుగా ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు బయటకు పొక్కనీయలేదు. గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టి నాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించారు రాఘవ. Ponguleti son Raghava | […]

అక్షరటుడే, హైదరాబాద్​: Ponguleti son Raghava | భూకబ్జాకు యత్నించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కుమారుడి కంపెనీపై కేసు నమోదైంది. గచ్చిబౌలిలో 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పొంగులేటి కొడుకు రాఘవ యత్నించారు. అడ్డుకున్న భూ యజమానిపై పొక్లెయిన్​తో దాడి చేశారు.

గత నాలుగు రోజులుగా ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు బయటకు పొక్కనీయలేదు. గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టి నాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించారు రాఘవ.

Ponguleti son Raghava | బౌన్సర్లతో దాడి..

70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశారు. అడ్డుకున్న అడ్డుకున్న స్థలం యజమానిపై దాడికి దిగారు.

పల్లవి షా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్న గోషాలను సైతం ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆదివారం (నవంబరు 30) అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పొంగులేటికి చెందిన రాఘవ కన్​స్ట్రక్షన్​తోపాటు మరో ఐదుగురుపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...