SP Rajesh Chandra | అత్యవసర పరిస్థితుల్లో బాధితుల వద్దకే పోలీసు సేవలు: ఎస్పీ రాజేష్ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పోలీస్ స్టేషన్‌కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడి నుంచే కేసు నమోదు చేసి భరోసా కల్పిస్తారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. దోమకొండ పోలీస్ స్టేషన్​(Domakonda Police Station)ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రోల్ కాల్‌ను స్వయంగా పరిశీలించి, సిబ్బంది హాజరు, విధుల్లో పాటించాల్సిన క్రమశిక్షణ, […]

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పోలీస్ స్టేషన్‌కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడి నుంచే కేసు నమోదు చేసి భరోసా కల్పిస్తారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. దోమకొండ పోలీస్ స్టేషన్​(Domakonda Police Station)ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రోల్ కాల్‌ను స్వయంగా పరిశీలించి, సిబ్బంది హాజరు, విధుల్లో పాటించాల్సిన క్రమశిక్షణ, సమయపాలనపై అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

SP Rajesh Chandra | మెరుగైన సేవలందించాలి

ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలందించాలని, విధుల పట్ల అంకితభావంతో ఉండాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ (Telangana Police) శాఖ ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు నూతన కార్యాచరణను అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఇకపై బాధితుల ఇళ్ల వద్దకే పోలీసులు వచ్చి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తారని తెలిపారు.

SP Rajesh Chandra | అట్రాసిటీ నిరోధక చట్టం

ఈ విధానం శారీరక దాడులు, అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్, మైనర్ వేధింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఎంతో సహాయపడుతుందన్నారు. ఫోన్​కాల్‌, ఆన్‌లైన్ అభ్యర్థన, ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేస్తారని తెలిపారు.

ఈ సేవల ద్వారా ఫిర్యాదుల నమోదు మరింత వేగవంతమవడంతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని తెలిపారు. అనంతరం, జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లాలోని అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన కార్యాచరణ అమలుపై పటిష్టమైన దిశానిర్దేశం చేశారు. బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించడంలో అధికారులు, సిబ్బంది పాటించాల్సిన బాధ్యతలను, విధివిధానాలను సమగ్రంగా వివరించారు. క్షేత్రస్థాయిలో ఈ విధానం విజయవంతం కావాలని, తద్వారా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు పోలీస్ సేవలపై మరింత నమ్మకం కలిగించాలని అధికారులను ఆదేశించారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...