అక్షరటుడే, న్యూఢిల్లీ: PM Narendra Modi | గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాదంతో పోరాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi పేర్కొన్నారు. హమాస్ Hamas దాడి చేసి పౌరులను చంపడం చాలా దారుణమని అన్నారు. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ పౌరుల బాధలను తాము పంచుకున్నామని గుర్తుచేశారు. ఇజ్రాయెల్ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని ప్రధాని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్కు పూర్తిగా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో ప్రసంగించిన మొదటి భారత ప్రధానిని తానేనని, దీనిని గొప్ప గౌరవంగా భావిస్తుట్లు చెప్పారు. రెండోసారి ఇజ్రాయెల్కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారత్, ఇజ్రాయెల్ దేశాలు అతి ప్రాచీన నాగరికత కలిగిన దేశాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
PM Narendra Modi | స్నేహితుడి కంటే చాలా ఎక్కువ
భారత ప్రధాని మోడీ తమ దేశంలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆ దేశల పార్లమెంటులో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికిన అనంతరం నెతన్యాహు మాట్లాడారు. “ప్రపంచ దేశాల్లో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ చాలా గొప్ప నాయకులు. ఆయన మా దేశానికి స్నేహితుడి కంటే చాలా ఎక్కువ. మోడీ నాయకత్వంలో భారత దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్తో తమకు వాణిజ్య సంబంధాలు రెట్టింపు అయ్యాయి. అనేక విషయాల్లో తమ దేశానికి భారత్ అండగా నిలబడింది” అని నెతన్యాహు వివరించారు.
