Modi-Putin | పుతిన్ భారత్ పర్యటనలో అరుదైన దృశ్యం.. మోదీ కారులోనే ప్రయాణం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi-Putin | రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న రాత్రి భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్వయంగా ఘన స్వాగతం పలికారు. విమానం దిగిన వెంటనే ఇద్దరూ కరచాలనం చేసుకుని, స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం ఆత్మీయతను మరింత స్పష్టంగా చూపించింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి పీఎం నివాసానికి వెళ్లేందుకు పుతిన్ (Vladimir Putin) తన ప్రత్యేక ఆర్మర్డ్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi-Putin | రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న రాత్రి భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్వయంగా ఘన స్వాగతం పలికారు.

విమానం దిగిన వెంటనే ఇద్దరూ కరచాలనం చేసుకుని, స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం ఆత్మీయతను మరింత స్పష్టంగా చూపించింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి పీఎం నివాసానికి వెళ్లేందుకు పుతిన్ (Vladimir Putin) తన ప్రత్యేక ఆర్మర్డ్ వాహనం కాకుండా, ప్రధాని మోదీ అధికారిక వాహనం టయోటా ఫార్చ్యూనర్‌లోనే ప్రయాణించడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా పుతిన్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు తనతోపాటు అత్యంత భద్రత కలిగిన Aurus Senat Limousineను తీసుకెళ్తారు. దీనిని “ఫ్లైయింగ్ ఆన్ వీల్స్” (Flying On Wheels) అని కూడా పిలుస్తారు.

Modi-Putin | మోదీ ఎందుకు ఫార్చ్యూనర్ ఎంచుకున్నారు?

కానీ భారత్ పర్యటనలో ఆయన ఈ ఆచారాన్ని పక్కనపెట్టి మోదీ వాహనాన్ని ఎంచుకోవడం, రెండు దేశాల మధ్య ఉన్న విశ్వాసం, బలమైన బాంధవ్యాన్ని సూచిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేకించి భద్రత విషయంలో అత్యంత కఠినమైన విధానాలు పాటించే పుతిన్ తన కారును వదిలేయడం చాలా అరుదుగా జరుగుతుంది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రధాని మోదీ సాధారణంగా వాడే విలాసవంతమైన Range Rover Sentinelను కాకుండా, టయోటా ఫార్చ్యూనర్‌ వాహనాన్ని ఉపయోగించి పుతిన్‌ను పీఎం నివాసానికి తీసుకెళ్లడం చర్చకు దారి తీసింది.

ఈ ఫార్చ్యూనర్ ప్రత్యేకతలు ఏంటంటే ..సిగ్మా 4 MT మోడల్, MH01EN5795 రిజిస్ట్రేషన్ నంబరు, బీఎస్-6 నార్మ్స్ కి అనుగుణంగా తయారు అయింది. 2024 ఏప్రిల్‌లో ఈ కారు రిజిస్టర్‌ అయ్యింది. సమాచారం ప్రకారం ధర సుమారు ₹4.5 మిలియన్లు ఉంటుంద‌ట‌. అత్యాధునిక భద్రతా ఫీచర్లు కలిగిన కొత్త SPG వాహనాల సముదాయంలో భాగంగా ఈ కారు ఉండ‌గా, 2039 ఏప్రిల్ వరకు చెల్లుబాటుగా ఉంటుంది. ఈ వాహనం అత్యుత్తమ స్థాయి సెక్యూరిటీ మాడిఫికేషన్స్ (Security Modifications) కలిగి ఉండడం వల్లే దీన్ని ఎంచుకున్నారని సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అయితే భారత్ పర్యటనలో పుతిన్ ఇలాంటి అరుదైన నిర్ణయం తీసుకోవడం, రెండు దేశాల మైత్రి, విశ్వాసం, శక్తివంతమైన వ్యూహాత్మక సంబంధాలను మరోసారి రుజువు చేసింది. ఒకే కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, భారతీయ దౌత్య పరిమళాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...