Kothagudem Railway Station | రైల్వే స్టేషన్​లో పేలిన నాటుబాంబు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kothagudem Railway Station | రైల్వే స్టేషన్​లో నాటుబాంబు పేలడంతో (bomb Blast) ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో (Bhadradri Kothagudem railway station) బుధవారం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్​ ఒకటో నంబర్​ ప్లాట్​ఫామ్​పై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచులు వదిలి వెళ్లారు. అందులో ఉల్లిగడ్డ పరిమాణంలో ఏడు నాటు బాంబులు ఉన్నాయి. తినే పదార్థం అనుకొని ఓ కుక్క బాంబును కొరికింది. దీంతో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kothagudem Railway Station | రైల్వే స్టేషన్​లో నాటుబాంబు పేలడంతో (bomb Blast) ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో (Bhadradri Kothagudem railway station) బుధవారం చోటు చేసుకుంది.

రైల్వే స్టేషన్​ ఒకటో నంబర్​ ప్లాట్​ఫామ్​పై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచులు వదిలి వెళ్లారు. అందులో ఉల్లిగడ్డ పరిమాణంలో ఏడు నాటు బాంబులు ఉన్నాయి. తినే పదార్థం అనుకొని ఓ కుక్క బాంబును కొరికింది. దీంతో అది పేలి కుక్క అక్కడిక్కడే చనిపోయింది. ఈ ఘటనతో స్టేషన్​లో ఉన్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులు (Passengers) బయటకు పరుగులు తీశారు.

Kothagudem Railway Station | పోలీసుల తనిఖీ

సమాచారం అందుకున్న కొత్తగూడెం మూడో టౌన్​ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మిగతా సంచులను పరిశీలించారు. ఆరు నాటు బాంబులను (plant bombs) స్వాధీనం చేసుకున్నారు. ఉదయం వెళ్లే రైలులో నాటు బాంబులను తరలించేందుకు ఎవరో ప్రయత్నించి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...