NMC Nizamabad | డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు : NMC Nizamabad | డంపింగ్ యార్డు సమస్యను శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) పేర్కొన్నారు. నాగారంలోని డంపింగ్ యార్డు​ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బయో మైనింగ్ (Bio Mining) ద్వారా చెత్తను శుభ్రపర్చే పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం డంపింగ్​ యార్డులో చెత్త సమస్య […]

అక్షరటుడే, ఇందూరు : NMC Nizamabad | డంపింగ్ యార్డు సమస్యను శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) పేర్కొన్నారు. నాగారంలోని డంపింగ్ యార్డు​ను మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బయో మైనింగ్ (Bio Mining) ద్వారా చెత్తను శుభ్రపర్చే పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం డంపింగ్​ యార్డులో చెత్త సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. డంపింగ్ యార్డు​లో (Dumping Yard) పేరుకుపోయిన చెత్త వల్ల పరిసరాలకు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.

బయో మైనింగ్ పద్ధతిలో భాగంగా పాత చెత్తను వేరుచేసి, శుభ్రపర్చి తిరిగి ఉపయోగించుకునేలా చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 3,51,500 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధిచేసే ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. ప్రస్తుతం రెండు మిషన్లు పనిచేస్తుండగా.. అదనంగా మరో రెండుమిషన్లు అవసరమవుతాయని త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు (BJP Leaders) ఇల్లెందుల ప్రభాకర్, మున్సిపల్​ అధికారులు ఉన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...