Flag march | ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి: బోధన్​ ఏసీపీ

అక్షరటుడే, బోధన్​: Flag march | పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ (Bodhan ACP Srinivas) పేర్కొన్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు బోధన్​ రూరల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని సాలూరలో శుక్రవారం పోలీసులు ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించడం.. భయం లేకుండా ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఈ ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించినట్లు పేర్కొన్నారు. Flag march | […]

అక్షరటుడే, బోధన్​: Flag march | పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ (Bodhan ACP Srinivas) పేర్కొన్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు బోధన్​ రూరల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని సాలూరలో శుక్రవారం పోలీసులు ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించడం.. భయం లేకుండా ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఈ ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Flag march | శాంతిభద్రతలు కాపాడుతూనే..

సమాజంలో శాంతిభద్రతలు కాపాడుతూనే.. ఓటుహక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని బోధన్​ ఏసీపీ పేర్కొన్నారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి, ఎన్నికల నియమాలను పాటించాలన్నారు.

ఎన్నికల సమయంలో గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడడం లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లాగ్​మార్చ్​లో బోధన రూరల్ సీఐ విజయ్​బాబు, ఎస్​హెచ్​వో వెంకట్ నారాయణ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, ఎడపల్లి ఎస్సై రమ, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...