Homeజిల్లాలునిజామాబాద్​Dussehra holidays | సెలవులు ముగియడంతో తిరిగి పట్టణాలకు పయనమైన ప్రజలు

Dussehra holidays | సెలవులు ముగియడంతో తిరిగి పట్టణాలకు పయనమైన ప్రజలు

దసరా సెలవులు ముగియడంతో ప్రజలు పట్టణాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఇందల్వాయి, భిక్కనూరు టోల్​ప్లాజా వద్ద వాహనాల క్యూ కట్టాయి.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​: Dussehra holidays | దసరా (Dussehra) సందర్భంగా పట్టణవాసులు తమ సొంతూళ్లలో పండుగను ఆనందంగా జరుపుకున్నారు. బంధువులను కలుసుకుని సంబురంగా గడిపారు. ఇక ఆదివారంతో సెలవులు ముగిశాయి. దీంతో ఉదయం నుంచి హైదరాబాద్​ తదితర ప్రాంతాలకు ప్రజలు వెళ్తున్నారు.

Dussehra holidays | టోల్​ప్లాజా వద్ద ట్రాఫిక్​ జాం..

పల్లెలు, పట్టణాల నుంచి హైదరాబాద్​కు (Hyderabad) ప్రజలు తిరుగుముఖం పట్టడంతో ఇందల్వాయి(Indalwai), భిక్కనూరు(Bhiknoor toll plaza) టోల్​ప్లాజాల వద్ద విపరీతమైన వాహనాల రద్దీ నెలకొంది. టోల్​ప్లాజా వద్ద కార్ల, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. నిజామాబాద్​, కామారెడ్డి, ఆదిలాబాద్​, నిర్మల్​ ప్రాంతాల నుంచి అధికంగా ప్రజలు హైదరాబాద్​కు తరలివెళ్తున్నారు. దీంతో 44వ జాతీయ రహదారి సందడిగా మారింది.