Parliament Sessions | రేపటి నుంచి పార్లమెంట్​ సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parliament Sessions | పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్​ 19 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్​ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. Parliament Sessions | కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, కిరణ్‌ రిజిజు నేతృత్వంలో మీటింగ్​ జరిగింది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్రం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parliament Sessions | పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్​ 19 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్​ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

Parliament Sessions | కేంద్ర మంత్రులు

రాజ్‌నాథ్‌, కిరణ్‌ రిజిజు నేతృత్వంలో మీటింగ్​ జరిగింది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్రం కోరింది. కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు, టీఎంసీకి చెందిన డెరెక్ ఓబ్రియన్, ఐయూఎంఎల్‌కు చెందిన మహమ్మద్ బషీర్ పాల్గొన్నారు.

Parliament Sessions | వాడీవేడిగా సాగే అవకాశం

పార్లమెంట్​ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ఓటరు జాబితా సవరణ ఎస్​ఐర్​, ఢిల్లీ బాంబు పేలుడు (Delhi Bomb Blast) అంశాలపై విపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. అలాగే కేంద్రం సభ ముందుకు పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన ‘ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025’తో సహా 10 కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది. భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లు, ఎనిమిది ఇతర ముసాయిదా చట్టాలు ఎజెండాలో ఉన్నాయి. జాతీయ రహదారుల (సవరణ) బిల్లును ప్రవేశపెట్టడానికి కూడా జాబితా చేయబడింది. ఇది జాతీయ రహదారుల కోసం వేగవంతమైన, పారదర్శకమైన భూసేకరణను నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది. మరొక ప్రతిపాదిత చట్టం కార్పొరేట్ చట్టాలు (సవరణ) బిల్లు, 2025, ఇది వ్యాపారాన్ని సులభతరం చేయడానికి కంపెనీల చట్టం, 2013 LLP చట్టం, 2008లను సవరించడానికి దీనిని తీసుకు రానున్నారు. సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు (SMC) కూడా సభలో ప్రవేశ పెట్టనున్నారు. ప్రభుత్వం ఆర్బిట్రేషన్, రాజీ చట్టంలో కూడా మార్పులు చేయాలని యోచిస్తోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...