ePaper
More
    HomeFeaturesSmart Phone | తల్లిదండ్రులు జాగ్రత్త.. పిల్లలను పాడు చేస్తున్న స్మార్ట్​ఫోన్​

    Smart Phone | తల్లిదండ్రులు జాగ్రత్త.. పిల్లలను పాడు చేస్తున్న స్మార్ట్​ఫోన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Smart Phone | ప్రస్తుతం అధికారులు, నాయకులు ఎక్కడ మాట్లాడినా దేశానికి యువత బలం అంటుంటారు. కానీ రానున్న రోజుల్లో వారే దేశానికి భారం కానున్నారు. వినడానికి బాధగా ఉన్న ఇది నిజం. స్మార్ట్​ ఫోన్​(Smart Phone), సోషల్​ మీడియాకు బానిసలుగా మారిన యువత దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారనున్నారు.

    ప్రస్తుతం చిన్నా పెద్ద తేడా లేకుండా స్మార్ట్​ ఫోన్​, సోషల్​ మీడియా(Social Media)లకు బానిసలుగా మారారు. రెండేళ్ల బాలుడు కూడా ఫోన్​లో వీడియోలు పెడితేనే అన్నం తినే పరిస్థితి. టీనేజీకి వచ్చిన వారు తమకు ఫోన్​ కావాలని మారం చేస్తున్నారు. స్మార్ట్​ఫోన్​లో విచ్చలవిడిగా బూతులు, అసభ్యకర కంటెంట్​తో టీనేజీ వారు చెడిపోతున్నారు. ముఖ్యంగా ఓటీటీ(OTT)లు, వెబ్​ సిరీస్​(Web Series)ల్లోని కంటెంట్​తో యువత చెడు మార్గాల్లో ప్రయాణిస్తున్నారు.

    Smart Phone | నేరాలు చేస్తున్నారు

    పాఠశాలకు వెళ్లే విద్యార్థులు(Students) చదువుకోవాలి, ఆడుకోవాలి కానీ ప్రస్తుతం విద్యార్థులు నేరాలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఇటీవల కూకట్​పల్లి(Kukatpally)లో దొంగతానికి వెళ్లి బాలికను హత్య చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఆ బాలుడు చోరీ ఎలా చేయాలో ఓ పేపర్​లో రాసుకున్న తీరు విస్మయానికి గురి చేసింది. లోనికి వెళ్లి దొంగతనం చేసిన అనంతరం గ్యాస్​ లీక్​ చేయాలని అందులో రాసుకున్నాడు. చోరీ చేసే సమయంలో బాలిక చూడటంతో ఆమెను హత్య చేశాడు. ఓ 15 ఏళ్ల బాలుడు దొంగతనం, హత్య చేయడానికి కారణాలు స్మార్ట్​ఫోన్​, సోషల్​ మీడియా. గతంలో జీడిమెట్లలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ప్రియుడితో తన తల్లిని హత్య చేయించిన విషయం తెలిసిందే.

    Smart Phone | అబ్జర్వేషన్​ హోమ్​కు తరలింపు

    కూకట్​పల్లిలో సహస్రను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అబ్జర్వేషన్ హోమ్​కు తరలించారు. మైనర్ కావడంతో అతన్ని అబ్జర్వేషన్ హోంలో ఉంచారు. శనివారం జువైనైల్ కోర్టు(Juvenile Court)లో బాలుడిని హాజరు పరచనున్నారు. వైద్య పరీక్షల తర్వాత జువైనైల్ హోమ్​కు తరలించనున్నారు.

    Smart Phone | పిల్లలపై కన్నేయండి

    ప్రస్తుతం పిల్లలు చిన్నప్పటి నుంచే ఫోన్లకు బానిసలు కావడంతో వారి ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. సినిమాలు, వెబ్​సిరీస్​ల పుణ్యమా అని నేరాలు చేయడం హీరోయిజంగా భావిస్తున్నారు. దీనికి తోడు సోషల్​ మీడియాకు బానిసలుగా మారిన చాలా మంది ఏ పని చేయకుండా ఈజీ మనీ(Easy Money) కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో దొంగతనాలు చేస్తూ ఆ డబ్బులతో ఎంజాయ్​ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు పిల్లలను స్మార్ట్​ఫోన్​కు దూరంగా ఉంచాలని చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి అతి గారబం చేయడం, తప్పులు చేస్తున్నా వెనుకేసుకురావడం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే భవిష్యత్​లో వారి జీవితాలు పాడువుతాయంటున్నారు.

    Latest articles

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    Musi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    అక్షరటుడే, హైదరాబాద్: Musi Riverfront development : మూసి నదీ (Musi River) తీరం అభివృద్ధి పనులు చేపట్టేందుకు...

    Yedla polala Amavasya | రైతులను ఆదరిద్దాం.. వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం: గడుగు గంగాధర్​

    అక్షరటుడే, ఇందూరు: Yedla polala Amavasya | రైతులను ఆదరించాలని.. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State...

    Sriram Sagar reservoir | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎనిమిది గేట్ల మూసివేత.. ఇంకా ఎన్ని ఓపెన్​ ఉన్నాయంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriram Sagar reservoir : ఉత్తర తెలంగాణ (Telangana) వరప్రదాయిని శ్రీరామ్​ సాగర్​ జలాశయాని(Sriram Sagar...

    More like this

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    Musi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    అక్షరటుడే, హైదరాబాద్: Musi Riverfront development : మూసి నదీ (Musi River) తీరం అభివృద్ధి పనులు చేపట్టేందుకు...

    Yedla polala Amavasya | రైతులను ఆదరిద్దాం.. వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం: గడుగు గంగాధర్​

    అక్షరటుడే, ఇందూరు: Yedla polala Amavasya | రైతులను ఆదరించాలని.. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State...