ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల నిమిత్తం వచ్చే వారిని లంచాల (bribes) పేరిట వేధిస్తున్నారు. పలువురు గ్రామీణ స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు అవినీతికి పాల్పడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఓ పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) ఏసీబీకి చిక్కాడు. తుంగతుర్తి మండలం గానుగబండ బర్పతి కృష్ణ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి గ్రామంలో నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. దానికి నంబర్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల నిమిత్తం వచ్చే వారిని లంచాల (bribes) పేరిట వేధిస్తున్నారు. పలువురు గ్రామీణ స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు అవినీతికి పాల్పడుతున్నారు.

సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఓ పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) ఏసీబీకి చిక్కాడు. తుంగతుర్తి మండలం గానుగబండ బర్పతి కృష్ణ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి గ్రామంలో నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. దానికి నంబర్​ కేటాయించడం కోసం పంచాయతీ కార్యదర్శి కృష్ణ రూ.6 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ACB Raid | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌ 1064ను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), facebook (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Related articles

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

Kharge Jaggareddy Meeting | ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి.. రాజ్యసభ సభ్యులపై వినతి

కాంగ్రెస్​ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్​రావు, జెట్టి కుసుమకుమర్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.

BC Reservations Congress | కాంగ్రెస్​ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత..:​ ఈరవత్రి అనిల్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు.

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.