Peddapalli District | ఇద్దరిని బలిగొన్న పంచాయితీ.. భార్యభర్తల గొడవపై చర్చిస్తుండగా ఘర్షణ..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Peddapalli District | భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు నిర్వహించిన పంచాయితీ అదుపు తప్పింది. మాట మాట పెరిగి దాడికి దారి తీసింది. రెచ్చిపోయి కత్తులతో దాడి చేసుకోవడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం(Sultanabad Mandal) సుగ్లాంపల్లిలో మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది. Peddapalli District | చర్చలకు వచ్చి.. పెద్దపల్లి (Peddapalli) మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన అమ్మాయికి, ఓదెల మండలానికి చెందిన అబ్బాయికి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Peddapalli District | భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు నిర్వహించిన పంచాయితీ అదుపు తప్పింది. మాట మాట పెరిగి దాడికి దారి తీసింది. రెచ్చిపోయి కత్తులతో దాడి చేసుకోవడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం(Sultanabad Mandal) సుగ్లాంపల్లిలో మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది.

Peddapalli District | చర్చలకు వచ్చి..

పెద్దపల్లి (Peddapalli) మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన అమ్మాయికి, ఓదెల మండలానికి చెందిన అబ్బాయికి గతంలో వివాహం జరిగింది. అయితే, దంపతుల మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ వ్యవహారం పెద్ద మనుషుల వద్దకు చేరింది. దీంతో ఇరువైపులా వారు మంగళవారం సుగ్లాంపల్లి గ్రామం (Suglampally Village)లో పంచాయితీ పెట్టారు. చర్చలు జరుగుతుండగానే వాగ్వాదం మొదలైంది.

Peddapalli District | సుపారీ ఇచ్చి దాడి..

పంచాయితీ జరుగుతుండగా ఇరువైపులా వారు అదుపు తప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు మాట మాట అనుకున్నారు. ఈ వాగ్వాదం కాస్త పెరిగి పూర్తిగా అదుపు తప్పింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ అదుపు తప్పింది. అమ్మాయి తరఫు వారు కత్తులతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో కత్తిపోట్లకు గురైన తీవ్ర రక్తస్రావంతో మల్లేశ్, గణేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మోటం మధునయ్యకు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉంది. మోటం సారయ్య తలకు గాయాలు మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని అత్యవసరంగా సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ ఆసుపత్రి (Karimnagar Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య తరఫు వారు సుపారీ ముఠాను తీసుకొచ్చి ఈ దారుణానికి పాల్పడిందని భర్త తరఫు వారు ఆరోపించారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...