United Nations | కశ్మీర్​ గురించి మాట్లాడిన పాక్​.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్

అక్షరటుడే, వెబ్​డెస్క్: United Nations | పాకిస్థాన్​ మరోసారి ఐక్యరాజ్య సమితిలో జమ్మూకశ్మీర్​ (Jammu and Kashmir) ప్రస్తావన తీసుకురాగా.. భారత్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాయాది దేశానికి బుద్ధి చెప్పింది. జనరల్ అసెంబ్లీలో ఇస్లామాబాద్ రాయబారి (Islamabad Ambassador) జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. పాకిస్థాన్ తన విభజన ఎజెండాను అమలు చేయడానికి UN వేదికలను దుర్వినియోగం చేస్తోందని భారత్ వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య దేశాలలో వేర్పాటును ప్రోత్సహించడానికి స్వయం నిర్ణయాధికార హక్కును దుర్వినియోగం చేయకూడదని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: United Nations | పాకిస్థాన్​ మరోసారి ఐక్యరాజ్య సమితిలో జమ్మూకశ్మీర్​ (Jammu and Kashmir) ప్రస్తావన తీసుకురాగా.. భారత్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాయాది దేశానికి బుద్ధి చెప్పింది.

జనరల్ అసెంబ్లీలో ఇస్లామాబాద్ రాయబారి (Islamabad Ambassador) జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. పాకిస్థాన్ తన విభజన ఎజెండాను అమలు చేయడానికి UN వేదికలను దుర్వినియోగం చేస్తోందని భారత్ వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య దేశాలలో వేర్పాటును ప్రోత్సహించడానికి స్వయం నిర్ణయాధికార హక్కును దుర్వినియోగం చేయకూడదని యూఎన్​కు భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్ ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ అన్నారు. పాక్​ తమ విభజన ఎజెండాను నడపడానికి ఐరాసలోని అన్ని వేదికలు, ప్రక్రియలను దుర్వినియోగం చేస్తూనే ఉందని మండిపడ్డారు.

United Nations | సూచనలు అవసరం లేదు

భారత్​ (India)లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్ గురించి పాక్​ అనవసరమైన సూచన చేసిందని పున్నూస్ అన్నారు. ఆ దేశం అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఐక్యరాజ్యసమితి, దాని వివిధ వేదికలలో పాక్​ పదే పదే కశ్మీర్ సమస్యను లేవనెత్తుతుంది. కానీ ఈ విషయంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఎటువంటి అవగాహనను పొందడంలో విఫలమైంది. పున్నూస్ తన వ్యాఖ్యలలో, గ్లోబల్ సౌత్ దాని ప్రత్యేకమైన అభివృద్ధి సవాళ్లను కలిగి ఉందని కూడా నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఘర్షణలు చెలరేగుతున్నందున, శాంతి కోసం ఐక్యరాజ్యసమితి కృషి చేయాలని ప్రపంచం ఆశిస్తోంది అని పున్నూస్ అన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...