అక్షరటుడే, న్యూఢిల్లీ: Pak mischief : పహల్గావ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి కాల్పుల కలకలం కొనసాగుతోంది. పాకిస్తాన్ సైన్యం వరుసగా నాలుగో రోజు కవ్వింపులకు దిగింది. పూంఛ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపినట్లు సోమవారం సైనిక వర్గాలు తెలిపాయి. దీన్ని భారత సైన్యం స్ట్రాంగ్ వార్నింగ్తో సమర్థంగా తిప్పికొట్టిందని పేర్కొన్నాయి.
