Road Accident | ఏపీలో మ‌రో ఘోర ప్ర‌మాదం.. క్యాబిన్‌లో ఇరుక్కొని డ్రైవ‌ర్ స‌జీవ ద‌హ‌నం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Road Accident | ఏపీలో ఇటీవ‌ల జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాలు ప్రతి ఒక్క‌రిని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్నాయి. బ‌స్సులు, లారీలు రోడ్డు ప్ర‌మాదానికి గురి కావ‌డం అందులోని వారు స‌జీవ ద‌హ‌నం కావ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్ర‌కాశం జిల్లాలో ఒక భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెస్తవారిపేట మండలం (Bestavaripet Mandal) పెంచికలపాడు గ్రామ సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Road Accident | ఏపీలో ఇటీవ‌ల జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాలు ప్రతి ఒక్క‌రిని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్నాయి. బ‌స్సులు, లారీలు రోడ్డు ప్ర‌మాదానికి గురి కావ‌డం అందులోని వారు స‌జీవ ద‌హ‌నం కావ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ప్ర‌కాశం జిల్లాలో ఒక భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెస్తవారిపేట మండలం (Bestavaripet Mandal) పెంచికలపాడు గ్రామ సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం తీవ్రత, తదనంతరం చెలరేగిన మంటలు ప్రాంతంలో కలకలం రేపాయి.

Road Accident | ఎలా జరిగింది ప్రమాదం?

వివరాల ప్రకారం, అనంతపురం నుంచి టమాటా లోడ్‌తో రాజమండ్రి (Rajamundry) దిశగా వస్తున్న లారీ పెంచికలపాడు వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా దాని టైరు పేలిపోయింది. టైరు పగిలిన ప్రభావంతో లారీ అదుపు కోల్పోయి ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ (Oil Tanker)పై దూసుకెళ్లింది. బలంగా ఢీకొట్ట‌డం వ‌ల‌న టమాటాతో నిండిన లారీ బోల్తా పడింది. ఇక ఆయిల్ ట్యాంకర్ ముందుభాగం పూర్తిగా ఛిద్రమైంది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పైడికొండల దుర్గారావు (40) క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. ఢీకొట్టిన కొన్ని క్షణాల్లోనే ట్యాంకర్‌లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. బయటకు రావడానికి మార్గం లేకపోవడంతో డ్రైవర్ సజీవదహనమై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి (Devarapalli) పట్టణానికి చెందినవారని పోలీసులు గుర్తించారు.

దుర్గారావు విశాఖ సమీపంలోని పరవాడలోని ఒక డిపో నుంచి ఆయిల్ లోడ్ చేసుకుని తాడిపత్రిలోని సిమెంట్ పరిశ్రమ (Cement Industry)కు వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన టమాటా లారీ అదుపు తప్పడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే గిద్దలూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ట్యాంకర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమై రహదారిపై ఆయిల్, కూరగాయలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసిన గిద్దలూరు పోలీసులు, రెండు లారీలను సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి టైరు పేలిపోవడమే కారణమా? లేక ఇతర సాంకేతిక లోపాలు ఉన్నాయా? అనేది విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...