Padma Awards ceremony | శ్రీజేశ్, అశ్విన్​కు పద్మ అవార్డులు- భారత అథ్లెట్లకు అరుదైన గౌరవం

అక్షరటుడే, న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారం పొందారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కొనసాగింది. ఈ వేడుకకు అశ్విన్ భార్య, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం వేళ అశ్విన్​కు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారం ప్రకటించింది. భారత క్రికెట్ జట్టుకు అశ్విన్ అందించిన సేవలకుగాను పద్మ అవార్డుతో కేంద్రం సత్కరించింది. అశ్విన్ 2010లో అంతర్జాతీయ టీ20తో అరంగేట్రం చేశాడు. […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారం పొందారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కొనసాగింది. ఈ వేడుకకు అశ్విన్ భార్య, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం వేళ అశ్విన్​కు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారం ప్రకటించింది. భారత క్రికెట్ జట్టుకు అశ్విన్ అందించిన సేవలకుగాను పద్మ అవార్డుతో కేంద్రం సత్కరించింది.

అశ్విన్ 2010లో అంతర్జాతీయ టీ20తో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 14 ఏళ్ల కెరీర్​లో అశ్విన్ టీమిండియా అనేక విజయాలు అందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో పలు రికార్డులు లిఖించాడు. టెస్టుల్లో 537 వికెట్లు తీసుకొని, 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. గతేడాది ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​తో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో ఆడుతున్నాడు.

Padma Awards ceremony : భారత అథ్లెట్​..

భారత అథ్లెట్, టీమిండియా మాజీ హాకీ ప్లేయర్, ఒలింపిక్ మెడలిస్ట్ పీఆర్ శ్రీజేశ్ Indian athlete, former Team India hockey player, and Olympic medalist PR Sreejesh పద్మ భూషణ్ అవార్డు Padma Bhushan award అందుకున్నారు. రాష్ట్రపతిభవన్​లో శ్రీజేశ్​కు ద్రౌపదీ ముర్ము పురస్కారం అందజేశారు. ఈ వేడుకకు శ్రీజేశ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. శ్రీజేశ్ సంప్రదాయ దుస్తులైన పంచకట్టుతో ఈ ఈవెంట్​కు వచ్చారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...