Homeజిల్లాలుకామారెడ్డిPaddy Centers | వరి కొనుగోళ్లు వేగవంతంగా పూర్తిచేయాలి: కలెక్టర్​

Paddy Centers | వరి కొనుగోళ్లు వేగవంతంగా పూర్తిచేయాలి: కలెక్టర్​

వరి కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు. తాడ్వాయి మండలం కరడ్​పల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Centers | వరి కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) ఆదేశించారు. తాడ్వాయి మండలం (Tadwai Mandal) కరడ్​పల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ప్యాక్స్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్ల తీరు, గన్నీబ్యాగులు, రవాణా సదుపాయాలను ఆరా తీశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం స్థానిక ప్రజలతో కలెక్టర్​ మాట్లాడగా వారు పలు సమస్యలను కలెక్టర్​ ముందుంచారు. జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు ద్వారా ఇబ్బందులు వస్తున్నాయని.. పాఠశాలలో తాగునీరు (drinking water), టాయిలెట్స్ సమస్యలపై కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్​ వెంటనే తహశీల్దార్​, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్​ వెంట పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్​, సీపీవో, తదితరులున్నారు.

Must Read
Related News