Paddy Centers | వరి కొనుగోళ్లు వేగవంతంగా పూర్తిచేయాలి: కలెక్టర్​

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Centers | వరి కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) ఆదేశించారు. తాడ్వాయి మండలం (Tadwai Mandal) కరడ్​పల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ప్యాక్స్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్ల తీరు, గన్నీబ్యాగులు, రవాణా సదుపాయాలను ఆరా తీశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో కలెక్టర్​ మాట్లాడగా […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Centers | వరి కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) ఆదేశించారు. తాడ్వాయి మండలం (Tadwai Mandal) కరడ్​పల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ప్యాక్స్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్ల తీరు, గన్నీబ్యాగులు, రవాణా సదుపాయాలను ఆరా తీశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం స్థానిక ప్రజలతో కలెక్టర్​ మాట్లాడగా వారు పలు సమస్యలను కలెక్టర్​ ముందుంచారు. జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు ద్వారా ఇబ్బందులు వస్తున్నాయని.. పాఠశాలలో తాగునీరు (drinking water), టాయిలెట్స్ సమస్యలపై కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్​ వెంటనే తహశీల్దార్​, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్​ వెంట పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్​, సీపీవో, తదితరులున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...