PCC Chief | ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదే..: టీపీసీసీ చీఫ్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : PCC Chief | ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్​ గౌడ్​ (MLC Mahesh Kumar Goud) అన్నారు. భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ వజ్రోత్సవాల వేల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్​ (Baba Saheb Ambedkar)ను స్మరించుకున్నామన్నారు. భారత రాజ్యాంగం ఇతర […]

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : PCC Chief | ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్​ గౌడ్​ (MLC Mahesh Kumar Goud) అన్నారు. భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ వజ్రోత్సవాల వేల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్​ (Baba Saheb Ambedkar)ను స్మరించుకున్నామన్నారు. భారత రాజ్యాంగం ఇతర దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. విద్యావంతులు, మేధావులు అరాచక శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట వ్యవసాయ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​, నాయకులు ఉన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...